దళిత యువకుడిపై - సర్పంచ్ భర్త "గ్యాంగ్ దాడి"
మురికి కాలువలో వేసి త్రొక్కారు
బైక్ లతో వెంబడించి మరో సారి దాడి
తల్లొచ్చి 4 సార్లు కాళ్ళు మొక్కినా వదలని "క్రూరాత్ములు"
ఎస్సీ, ఎస్టీ తో పాటు హత్యా యత్నం కేసు నమోదు
విచారణ జరిపిన జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
పత్రికా ప్రకటన జారీ చేసిన ధర్మపురి సి.ఐ.
( చుక్క గంగారెడ్డి - సీనియర్ జర్నలిస్ట్ 9948133539 )
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడు దమ్మ తిరుపతి తల్లి దమ్మ లక్ష్మి, అతని భార్య
గంగలక్ష్మి, గ్రామస్తులు తెలిపిన వివరాలతో పాటు పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు, సీసీ కెమెరాల పుటేజీల ఆధారాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు న్యాయం చేయాల్సిన చిన్నాపూర్
ప్రథమ పౌరురాలు భర్త ( సర్పంచ్ గట్టు శారద భర్త ) గట్టు గంగారాం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు దమ్మ తిరుపతి పై అత్యంత దారుణమైన దాడి చేశాడు. దళితుడిని అకారణంగా చితక బాధడమే కాకుండా హత్య చేయాలని
ఉద్దేశ్య పూర్వకంగా.మురికి కాలువలో వేసి కాళ్లతో త్రొక్కాడు. ఆయన తల్లి దమ్మ లక్ష్మి హుటా హుటిన వచ్చి తన కొడుకును చంప వద్దని నాలుగు సార్లు సర్పంచ్ భర్త గట్టు గంగారాం
కాళ్ళు మ్రొక్కింది. అయినా వదలలేదు. అంతే కాకుండా
అతని గ్యాంగ్ తో మోటార్ సైకిల్ లపై దమ్మ తిరుపతి ని వెంబడించి మరోసారి అదే దళితుడిపై సర్పంచ్ భర్త తన గ్యాంగ్ తో
క్రూర మృగాల లాగా వ్యవహరించి దాడి చేసి అత్యంత కిరాతకంగా చితక బాదారు అనడానికి అక్కడ నమోదైన
సీసీ కెమెరాల పుటేజీలే ప్రధాన సాక్ష్యంగా నిలిచాయి.
బాధితుడి తల్లి దమ్మ లక్ష్మీ తన కొడుకు పై జరుగుతున్న అఘాయిత్యాన్ని తెలుసుకొని వచ్చి నాలుగు సార్లు సర్పంచ్ భర్త ( దుండగుల ) కాళ్ళు మొక్కినా వదల కుండా కన్నతల్లి కండ్ల ముందే దళితుడిని ఇష్టం వచ్చినట్లు చితక బాదారు. కాళ్ళతో తన్నారు. నానా రకాల దుర్భాషలతో దాడి చేశారు.
స్థానికుల సహాయంతో బాధితుడు దమ్మ తిరుపతిని గురువారం మధ్యాహ్నం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటన పై
బుగ్గారం ఎస్సై జి.సతీష్ గురువారం రాత్రి బాధితుడి తల్లి దమ్మ లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శుక్రవారం ఉదయం చిన్నాపూర్ లోని రెండు వేర్వేరు ఘటనా స్థలాలను సందర్శించారు. గ్రామస్తులతో కలిసి ఆయన విచారణ జరిపారు. యువకునిపై దాడి జరిగిన చిన్నాపూర్ బస్టాండ్ ప్రాంతాన్ని, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మరో సంఘటన స్థలాన్ని డీఎస్పీ స్వయంగా సందర్శించారు. ఆ రెండు చోట్ల సీసీ కెమెరాల పుటేజీలను ఆయన స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది దళితుడిపై జరిగిన హత్యాయత్నం దాడిగా నిర్ధారణ కు వచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి ధర్మపురి సి.ఐ. ఎ.రామ్ నర్సింహా రెడ్డి పత్రికా ప్రకటన జారీ చేశారు. చిన్నాపూర్ ఘటన ఉద్దేశ్య పూర్వకంగా జరిపిన హత్యా యత్నం దాడి అని ఆ పత్రికా ప్రకటనలో తెలిపారు. పలు సెక్షన్ల తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుగా, హత్యాయత్నం కేసుగా సెక్షన్ల ను మార్పులు చేయడం జరిగిందన్నారు.
చిన్నాపూర్ గ్రామానికి చెందిన
గట్టు గంగారాం ( సర్పంచ్ భర్త ), అతని తమ్ముడు గట్టు గంగాధర్ ( సర్పంచ్ మరిది ) అతని కుమారుడు గట్టు గణేష్ ( సర్పంచ్ కొడుకు ) లతో పాటు వారి బంధువు గట్టు శ్రవణ్ లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దమ్మ లక్ష్మి పిర్యాదు, కేసు దర్యాప్తు ల వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన దమ్మ తిరుపతి ని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారాం, గట్టు గంగాధర్, గట్టు గణేష్, గట్టు శ్రవణ్ లు కలిసి హత్యాయత్నం చేశారని నిర్ధారించబడినట్లు ధర్మపురి సి.ఐ. ఎ.రాం నర్సింహ రెడ్డి జారీ చేసిన పత్రికా ప్రకటన లో వివరించారు. క్రైమ్ నం. 22/2026 గా నమోదైన ఈ కేసులో సెక్షన్లు 115 (2), 118(1), 292, 351(2), ఆర్ డబ్లు 3(5) బి ఎన్ ఎస్. , 3(1) (ఆర్) (ఎస్), 3(2) (వి. ఎ.) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ పి.ఓ. ఎ. యాక్ట్ కింద కేసు తో పాటు అదనంగా బి. ఎన్.ఎస్. 109(1) సెక్షన్ ను కూడా చేర్చడం జరిగిందని ధర్మపురి సి.ఐ. ఎ. రాం నర్సింహ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే....
దళిత యువకుడిపై - సర్పంచ్ భర్త "గ్యాంగ్ దాడి"
మురికి కాలువలో వేసి త్రొక్కారు
బైక్ లతో వెంబడించి మరో సారి దాడి
తల్లొచ్చి 4 సార్లు కాళ్ళు మొక్కినా వదలని "క్రూరాత్ములు"
ఎస్సీ, ఎస్టీ తో పాటు హత్యా యత్నం కేసు నమోదు
విచారణ జరిపిన జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
పత్రికా ప్రకటన జారీ చేసిన ధర్మపురి సి.ఐ.
( చుక్క గంగారెడ్డి - సీనియర్ జర్నలిస్ట్ 9948133539 )
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడు దమ్మ తిరుపతి తల్లి దమ్మ లక్ష్మి, అతని భార్య
గంగలక్ష్మి, గ్రామస్తులు తెలిపిన వివరాలతో పాటు పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు, సీసీ కెమెరాల పుటేజీల ఆధారాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు న్యాయం చేయాల్సిన చిన్నాపూర్
ప్రథమ పౌరురాలు భర్త ( సర్పంచ్ గట్టు శారద భర్త ) గట్టు గంగారాం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు దమ్మ తిరుపతి పై అత్యంత దారుణమైన దాడి చేశాడు. దళితుడిని అకారణంగా చితక బాధడమే కాకుండా హత్య చేయాలని
ఉద్దేశ్య పూర్వకంగా మురికి కాలువలో వేసి కాళ్లతో త్రొక్కినారు.
బాధితుడి తల్లి దమ్మ లక్ష్మి హుటా హుటిన వచ్చి తన కొడుకును చంప వద్దని నాలుగు సార్లు సర్పంచ్ భర్త గట్టు గంగారాం
కాళ్ళు మ్రొక్కింది. అయినా వదలలేదు. అంతే కాకుండా
అతని గ్యాంగ్ తో మోటార్ సైకిల్ లపై "దమ్మ తిరుపతి" ని వెంబడించి మరోసారి అదే దళితుడిపై సర్పంచ్ భర్త తన గ్యాంగ్ తో
క్రూర మృగాల లాగా వ్యవహరించి దాడి చేసి అత్యంత కిరాతకంగా చితక బాదారు అనడానికి అక్కడ నమోదైన
సీసీ కెమెరాల పుటేజీలే ప్రధాన సాక్ష్యంగా నిలిచాయి.
బాధితుడి తల్లి దమ్మ లక్ష్మీ తన కొడుకు పై జరుగుతున్న అఘాయిత్యాన్ని తెలుసుకొని వచ్చి నాలుగు సార్లు సర్పంచ్ భర్త ( దుండగుల ) కాళ్ళు మొక్కినా వదల కుండా కన్నతల్లి కండ్ల ముందే దళితుడిని ఇష్టం వచ్చినట్లు చితక బాదారు. కాళ్ళతో తన్నారు. చేతులతో, చెప్పులతో కొట్టారు.
నానా రకాల దుర్భాషలతో దాడి చేశారు.
వారి దాడి వల్ల సొమ్మసిల్లి పోయిన దమ్మ తిరుపతి ని
స్థానికులు గురువారం మధ్యాహ్నం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటన పై
బుగ్గారం ఎస్సై జి.సతీష్ గురువారం రాత్రి బాధితుడి తల్లి దమ్మ లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శుక్రవారం ఉదయం చిన్నాపూర్ లోని రెండు వేర్వేరు ఘటనా స్థలాలను సందర్శించారు. గ్రామస్తులతో కలిసి ఆయన విచారణ జరిపారు. యువకునిపై దాడి జరిగిన చిన్నాపూర్ బస్టాండ్ ప్రాంతాన్ని, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మరో సంఘటన స్థలాన్ని డీఎస్పీ స్వయంగా సందర్శించారు. ఆ రెండు చోట్ల సీసీ కెమెరాల పుటేజీలను ఆయన స్వయంగా - క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది దళితుడిపై జరిగిన ఉద్దేశ్య పూర్వక హత్యాయత్నం దాడిగా నిర్ధారణ కు వచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి ధర్మపురి సి.ఐ. ఎ.రామ్ నర్సింహా రెడ్డి పత్రికా ప్రకటన జారీ చేశారు. చిన్నాపూర్ ఘటన ఉద్దేశ్య పూర్వకంగా జరిపిన హత్యా యత్నం దాడి అని ఆ పత్రికా ప్రకటనలో తెలిపారు. పలు సెక్షన్ల తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుగా, హత్యాయత్నం కేసుగా సెక్షన్ల ను మార్పులు చేయడం జరిగిందన్నారు.
చిన్నాపూర్ గ్రామానికి చెందిన
గట్టు గంగారాం ( సర్పంచ్ భర్త ), అతని తమ్ముడు గట్టు గంగాధర్ ( సర్పంచ్ మరిది ) అతని కుమారుడు గట్టు గణేష్ ( సర్పంచ్ కొడుకు ) లతో పాటు వారి బంధువు గట్టు శ్రవణ్ లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దమ్మ లక్ష్మి పిర్యాదు, కేసు దర్యాప్తు ల వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన దమ్మ తిరుపతి ని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారాం, గట్టు గంగాధర్, గట్టు గణేష్, గట్టు శ్రవణ్ లు కలిసి హత్యాయత్నం చేశారని నిర్ధారించబడినట్లు ధర్మపురి సి.ఐ. ఎ.రాం నర్సింహ రెడ్డి జారీ చేసిన పత్రికా ప్రకటన లో వివరించారు. క్రైమ్ నం. 22/2026 గా నమోదైన ఈ కేసులో సెక్షన్లు 115 (2), 118(1), 292, 351(2), ఆర్ డబ్లు 3(5) బి ఎన్ ఎస్. , 3(1) (ఆర్) (ఎస్), 3(2) (వి. ఎ.) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ పి.ఓ. ఎ. యాక్ట్ కింద కేసు తో పాటు అదనంగా బి. ఎన్.ఎస్. 109(1) సెక్షన్ ను కూడా చేర్చడం జరిగిందని ధర్మపురి సి.ఐ. ఎ. రాం నర్సింహ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే....
సి.ఐ. ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్నపూర్ గ్రామానికి చెందిన ధమ్మ తిరుపతిని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారాం చిన్నపూర్ బస్ స్టాండ్ వద్ధ కులం పేరుతో దూషించి చేతులతో కొట్టినాడు. ఇట్టి గొడవ జరిగిన అనంతరం తిరుపతి తన ఇంటికి వెళ్తుండగా, గట్టు గంగారాం అతనిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో ధమ్మ తిరుపతి ఇంటికి వెళుతున్నట్టు తెలుసుకొని తన తమ్ముడు గట్టు గంగాధర్, తన కుమారుడు గట్టు గణేష్, అతని బంధువు అయినటువంటి గట్టు శ్రవణ్ లకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసి, తిరుపతిని ఎలాగైనా చంపాలని వారిని ప్రేరేపించాడు. ఆ ప్రణాళిక ప్రకారం వారు తిరుపతిని వెతికి పట్టుకుని చేతులతో, చెప్పుతో తల, చేతులు, కాళ్లపై కొట్టగా, అతనికి (దమ్మ తిరుపతి కి) గాయాలు అయ్యాయి.
దర్యాప్తులో బాగంగా గట్టు గంగారాం అతని తమ్ముడు గట్టు గంగాధర్, కుమారుడు గట్టు గణేష్ అతని బంధువు అయినటువంటి గట్టు శ్రవణ్ కలిసి ధమ్మ తిరుపతిని హత్యయత్నం చేసినారు అని నిర్ధారించబడగా, ఈ కేసులో ప్రస్తుత సెక్షన్లకు అదనంగా BNS చట్టంలోని 109(1) సెక్షన్ ను చేర్చడం జరిగింది.
ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. అని ధర్మపురి సి. ఐ. ఎ. రాం నర్సింహ రెడ్డి శుక్రవారం రాత్రి జారీ చేసిన పత్రికా ప్రకటన లో వివరించారు.