*ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు*
*ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు*
*@-నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)- నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు* *హైదరాబాద్/ అమరావతి/ వార్తా ప్రపంచం/ జనవరి 13:* తెలుగు వారికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగ ప్రజలందరూ కన్నుల పండుగగా కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో జరుపుకోవాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నేషనల్ ప్రెసిడెంట్ మరియు వార్తా ప్రపంచం చీఫ్ ఎడిటర్ డాక్టర్ బండి సురేంద్రబాబు కోరారు.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, ఆనందపు చిరునవ్వుతో, ఎటువంటి గొడవలు లేకుండా, మంచి, మర్యాద, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానంతో భోగి, సంక్రాంతి, కనుమ, పండుగలు జరుపుకోవాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటునట్లు సురేంద్ర బాబు తెలిపారు.
ఈ సందర్భంగా సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి దర్పణాలు, విభిన్న జాతుల సంస్కార బిందువులు మన ‘పండుగలు’. మన గతాన్ని స్మరింపజేసి, వర్తమానాన్ని పరామర్శించుకుంటూ, భవిష్యత్తును నిర్మించుకునే ఉత్సాహ స్ఫూర్తిని సందేశాల్ని ఇచ్చేవి - పండుగలన్నారు. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.
ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలన్నారు.
సంక్రాంతి పండుగను ముచ్చటగా మూడు రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అంటారు. సంక్రాంతిముందు రోజు వచ్చేది భోగి పండుగ. తెల్లవారక మునుపే లేచి ఇంటి ముందు భాగంలో భోగిమంటలు వేస్తారు. అనగా ఇంటిలోని పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఆ మంటల్లో వేస్తారు. మంటల చుట్టూ పిల్లలూ, పెద్దలూ కూర్చుని చలి కాచుకుంటారు. మనలోని దుష్ట భావనల్ని, దుర్గుణాల్ని జ్ఞానమనే మంటలో వేసి దహించటమే దీని అంతరార్థం. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, ముస్తాబు చేసి వరుసగా కూర్చోబెట్టి వారి తల మీద రేగిపండ్లు, బంతిపూలు, శనగలు, వయోవృద్ధులు ముతె్తైదువులు పోస్తారు. పెద్దలు చిన్నారులను ఆశీర్వదించటం, దృష్టి దోష నివారణ దీనిలోని ఆంతర్యం అని చెప్తూ, రేగిపండ్లలో సౌర తేజస్సు ఉంటుంది. సూర్యుడు ప్రాణ శక్తి ప్రదాత. కనుక, సూర్యతేజస్సు బ్రహ్మరంధ్రం గుండా పిల్లలకు అందివ్వబడుతుందన్నది, దీని వెనుక దాగిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యంగా చెప్తారు. సమన్వయ, సమరస భావంతో జీవన యాత్ర సల్పి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షించే నవ్య తేజస్సును పొందాలని ఉద్బోధిస్తోంది ‘మకర సంక్రాంతి.
Read More
|