పుణ్యగిరి శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా ఎస్పీ దామోదర్!
పుణ్యగిరి శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా ఎస్పీ దామోదర్!
ఎస్.కోట మండలం పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15న జరిగే శివరాత్రి పర్వ దినాన భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పోలీసుశాఖ ఏర్పాటు చేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ దామోదర్ ఫిబ్రవరి 10న స్వయంగా సమీక్షించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు పుణ్యగిరి కొండపైకి వెళ్ళి, శివుడ్ని దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లు, భద్రత ఏర్పాట్లును ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ సిసి కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేసుకొని వాటిని కంట్రోల్ రూముకు అనుసందానం చేసుకూవాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ - శివరాత్రి పర్వదినాన పుణ్యగిరి మరియు సన్యాసయ్యపాలెంకు సుమారు లక్షన్నర భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. విజయనగరం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి పుణ్యగిరికి వచ్చే ప్రత్యేక ఆర్టీసి బస్సులను, ఆటోలు మరియు వాహనాలను పార్కింగు చేసేందుకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లోకి అనిమతించి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. వాహనాల పార్కింగుకు ఎస్. కోటలోని నందిత హోటల్ వెనుక భాగం లోను, పంచాయతీ పార్కు, జి.జె. కాలేజ్ గ్రౌండు, ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఖాళీ స్థలాలను వాహనాల పార్కింగుకు కేటాయించామన్నారు. పుణ్యగిరి కొండపైన ప్రధాన ఆలయం, క్యూలైన్లు, పుట్టదార, కోటి లింగాల రేవు, దారగంగమ్మ ప్రాంతాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటులు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేసారు. భద్రత ఏర్పాట్లును పోలీసు అధికారులు పర్యవేక్షించేందుకు పుణ్యగిరి కొండపైన, కొండ దిగువన తాత్కాలిక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. పుణ్యగిరి మార్గంలోను, ఎస్.కోట పట్టణంలోను ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను డైవర్టు చేసేందుకు పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ రెగ్యులేషను చేసేందుకు దేవి బొమ్మ జంక్షను నుండి రైల్వే గేటు వరకు, రైల్వే గేటు నుండి పుణ్యగిరి వరకు, ఒన్ వే ట్రాఫిక్ జంక్షను నుండి ప్రకాశం పార్కు వరకు మూడు మూవింగు పార్టీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎగ్జిబిషన్స్ నిర్వహించే రైతు బజారు, ఆకుల డిపోల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డిఎస్పీ గోవిందరావు, ఎస్.కోట సిఐ నారాయణమూర్తి, ఎస్బీ సిఐ లీలారావు, ఎస్.కోట ఎస్ఐ, ఆలయ అధికారులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More
|