|
|
|
ఆధ్యాత్మికతను పెంచేది అయ్యప్ప మాల ధారణ
కష్టాలలో ఆదుకునేది భగవంతుడు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కన్నుల పండుగగా పడిపూజ
ఆధ్యాత్మికతను పెంచేది అయ్యప్ప మాల ధారణ
కష్టాలలో ఆదుకునేది భగవంతుడు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కన్నుల పండుగగా పడిపూజ
తొర్రూరు డిసెంబర్ 29 ప్రజల్లో భక్తి విశ్వాసం, ఆధ్యాత్మికతను పెంచేది అయ్యప్ప మాల ధారణ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు సోమవారం పట్టణ కేంద్రంలోని బట్టి కమల్ నారికేళ స్వామిగా 18వ సారి మాలధారణ చేసుకొని శబరిమల వెళుతున్న సందర్భంగా తన నివాసం వద్ద ఎంతో ఘనంగా పడిపూజను చేపట్టాడు. మంత్రి దయాకర్ మాట్లాడుతూ తనకు గురుస్వామి వెంకటేష్ శర్మ చంద్రమౌళి గురుస్వామి వారితో గత 30 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నదని తాను పర్వతగిరిలో, తొర్రూరులో, వర్ధన్నపేటలో కూడా పడిపూజలు నిర్వహిస్తూ పాల్గొన్నారు అని అత్యంత భక్తిశ్రద్ధలతో దీక్షను పూర్తి చేయాలని అన్నారు పడిపూజను ప్రముఖ గురుస్వామి సి వెంకటేష్ శర్మ కన్నుల పండుగగా స్వామివారికి అభిషేకాలు పుష్పార్చన, గణపతి ,సుబ్రహ్మణ్య, అమ్మవారు ,అయ్యప్ప స్వామి వారల అష్టోత్తరాలను నిర్వహించారు . 18వ సారి మాల ధారణ చేసి నారీకేల స్వామికి వెళ్లే స్వామి యొక్క దీక్ష విశిష్టతను తెలియజేశారు .అయ్యప్ప దీక్షలో స్వాములు ఆచరించాల్సిన నియమాలను వనయాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలను శబరిమలై లో ఉండే పడిమెట్ల విశిష్టతను, స్వాములు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శబరిమల యాత్రను చేయాలని సూచించారు. శబరిమలైలో కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ నిషేధించబడిందని స్వాములు గమనించాలన్నారు శబరిమల లో నిన్నటి మండల పూజ వరకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు సంక్రాంతి కి మకర జ్యోతి దర్శనానికి వెళ్లే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలను చేశారు . ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ తిరుపతిరెడ్డి, ఆలయ గురుస్వామి రేణిగుంట్ల శివ సీనియర్ స్వాములు కొనుగంటి కృపాకర్ రాజు, దారం ప్రసాద్ బిజ్జాల అనిల్ కుమార్, సురేష్, బిజ్జాల వెంకటరమణ ఇమ్మడి రాంబాబు తల్లాడ హిరాధర్, హరిప్రసాద్ ,నిమ్మల శేఖర్, వెయ్యి మంది పైగా స్వాములు, బట్టి కమల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజు,గిద్దె రాంనర్సయ్య ఆలపించిన భక్తి సంగీత విబావారి స్వాములను ఎంతగానో ఆకట్టుకుంది
Read More
|
|
|