జంఝావతి కోసం జన గర్జన: నిర్లక్ష్యం వీడేదాకా ఆగని పోరాటం!
జంఝావతి కోసం జన గర్జన: నిర్లక్ష్యం వీడేదాకా ఆగని పోరాటం!
జంఝావతి ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కొనసాగుతోంది. రబ్బర్ డ్యాం నిర్మించినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వాల అలక్ష్యం వలన మూలకి చేరింది. దీని మీద అనేక సార్లు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి విన్నపాలు చేసింది. అయినా ఫలితం లేదు. ప్రజావిన్నపాల పట్ల ప్రభుత్వాలు సానుకూలతను చూపలేకపోవడం. ఆ కారణంగానే జంఝావతి సాధన సమితి ఏర్పాటు అయ్యింది. ఏర్పడైన సమితి ఆధ్వర్యంలో ప్రాజెక్టు కోసం బైక్ ర్యాలీని చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు పార్వతీపురం పట్టణంలో రాయగడ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద స్వామి విగ్రహం వద్దకు సాధన కార్యకర్తలు చేరుకున్నారు. వివేకానంద స్వామికి వినతి పత్రం అందజేశారు. అక్కడ నుంచి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, సమితి జిల్లా అధ్యక్షులు వంగ దాలినాయుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది. లక్ష్మీనారాయణ పురం, చిన్న బొండపల్లి, వెంకంపేట, పెద్ద బొండపల్లి, సుడిగం, కవిటిభద్ర, పుట్యూరు, లచ్చిరాజుపేట, తాళ్ల బురిడి, జమదాల, జమ్ముడి వలస, బందలుపి, వీరభద్రపురం, అంటి వలస, కొత్తవలస, డి. నిరాం, లోవర కండి, గెడ్డలుప్పి, రేవటి వలస, పులిగుమ్మి, నూరంపేట, గుచ్చిమి, జోగంపేట, పెద్ద భోగిలి, చిన్న రాయుడుపేట, మరిపివలస, నర్సిపురం, కారాడ వలస, విశ్వంభర పురం, అనంత రాయుడుపేట గ్రామాల్లో ఈ ర్యాలీ కొనసాగింది. ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు. సాగునీటి కోసం వారుపడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాలతి కృష్ణమూర్తి, వంగ దాలినాయుడు మాట్లాడుతూ జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధనకై ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి కోసం కన్వీటి యాత్రను చేపట్టామన్నారు. రైతులతో పాటు సర్పంచుల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ మంత్రులకు సమర్పించడం జరిగిందన్నారు. కనీసం ఇప్పటికైనా మంత్రులు స్పందించాలన్నారు. ఈ బైక్ ర్యాలీతో రైతుల్లో చైతన్యం నింపి జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జంఝావతి సాధనకై తాము చేపట్టిన క్రతువుల ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంఝావతి ప్రాజెక్టు పూర్తయి పూర్తిస్థాయి ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఏడాడికి రెండు పంటలు, అపరాలు పండించు కున్నప్పటికీ రైతు రాజు అవుతాడన్నారు. వలసలు తగ్గుతాయ న్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాజెక్టు సాధనకై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి ప్రతినిధులు సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భాస్కర్ విద్యాసంస్థల అధినేత చుక్క భాస్కరరావు, సమితి ప్రతినిధులు వ్రి శివకృష్ణ, ఈర్ల సంజీవ నాయుడు, గొర్లి శ్రావణ్ కుమార్, చుక్క చంద్రరావు, అల్లు సత్యం నాయుడు, భరతానంద మహరాజ్ స్వామీజీ, చల్లాపు వెంకట్ నాయుడు, నల్ల బలరాం నాయుడు, నెల్లి లక్ష్మణ్ నాయుడు, మంత్రాపూడి వెంకటరమణ, బొమ్మినేని అప్పారావు, గొట్టాపు చిన్నం నాయుడు మద్దతు తెలిపారు.
Read More
|