|
|
|
ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులకు ఘన సన్మానం.
ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులకు ఘన సన్మానం.
పాణ్యం (AIMA MEDIA): ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 107 మంది ప్రతిభావంతులను శనివారం ఘనంగా సత్కరించారు. ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు 107మందిని ఆర్జీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్ శాంతి రాముడు సత్కరించి నగదు బహుమతులు అందజేశారు. ఎన్నో సాంకేతిక పత్రాలు సమర్పించిన వీరికి సత్కారం చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు. 2025లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గుర్తించిన ప్రపంచ రెండు శాతం శాస్త్ర వేత్తలలోని ఐదు మందిని ఘనంగా సత్కరించి ఒక్కొక్కరికి రూ 20వేల నగదుబహుమతి, ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరిలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉపేంద్ర రజాక్, డాక్టర్ జమాలయ్యా, డాక్టర్ వెంకటకృష్ణయ్యలు ఉన్నారు. అలాగే 14 వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్ పత్రాలు, 9 స్కోపస్ ఇండెక్స్ పత్రాలు, పేటెంట్ను పొందిన డాక్టర్ ఉపేంద్ర రజాక్ ను ఘనంగా సత్కరించి రూ. 72 వేల నగదు బహుమతితో సత్కరించారు. అలాగే 21 వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్ పత్రాలు, ఒక కోపస్ ఇండెక్స్ పత్రాలతో టాపర్గా నిలిచిన గణిత అధ్యాపకులు డాక్టర్ రామశేఖర్ ను రూ. 64 వేల నగదుతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు కళాశాలకు ఎంతో గౌరవం తెచ్చిన అధ్యాపకులను గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ రామిరెడ్డి కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Read More
|
|
|