logo
AIMA MEDIA
logo
logo
India Uttar Pradesh (UP) Madhya Pradesh (MP) Rajasthan (RJ) Bihar (BR) Punjab (PB) Haryana (HR) More
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK THAKUR was honoured by AIMA President Mahesh Sharma, Meerut Cantt MLA Shri Amit Agarwal and others in a programme organised by AIMA on the auspicious occasion of HINDI PATRKARITA DIVAS.
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK Thakur addressing on the role of social media in the present era.
Slide 1
Shri Amit Agarwal (Meerut Cantonment MLA), special guest, inaugurator was honoured by presenting memento by ADG Meerut Zone Shri DK Thakur, AIMA President Shri Mahesh Sharma, District President Shri Charan Singh Swami and others.
Slide 1
Shri Ravi Prakash Tiwari (Editor-in-Charge - Dainik Jagran, Meerut) was honored by presenting a memento by ADG Meerut Zone Shri DK Thakur, Meerut Cantonment MLA Shri Amit Agarwal, AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Rajendra Singh (Information Commissioner and former editor Amar Ujala) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Pushpendra Sharma (former editor Hindustan) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Ramkumar Sharma (senior advocate and patron AIMA) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Rajesh Sharma (senior journalist, Editor- Save India Foundation) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Arun Jindal (Vibhag Sampark Pramukh RSS) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Shri Surendra Sharma (Retd. Suchna Adhikari) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Gyan Dixit (Sr. photo journalist and Dada Saheb Falke Film Awardy ) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Slide 1
అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి* .. అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి* ..


*అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి*
అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి*
అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో వస్తున్న గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించి అర్జీలను స్వీకరించారు.*

- *ఈ సందర్భంగా నారాయణపురం పంచాయతీలో ఎలైట్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీదారులు అర్జీ అందించారు. మార్ట్ గేజ్ పరిశీలన చేయాలని అర్జీ అందించారు. ఉప్పరపల్లిలో అనధికార లేఅవుట్ లో భవనం కడుతున్నారని, కక్కలపల్లి ఎల్ఆర్ఎస్ ఓపెన్ సైట్ ని వెరిఫై చేయాలని, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కావాలని అర్జీలు సమర్పించగా, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అహుడ సెక్రటరీ ఆదేశించారు. పరిగి చుట్టుపక్కల పరిధిలో అనధికార లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్ లు వేసి తనిఖీలు చేయాలని ఆదేశించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పిఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*
Read More
1
1
0
0 Views 0 Shares 0 Comments
పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3C ఫార్మూలను నిర్దేశించిన ముఖ్యమంత్రి* పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3C ఫార్మూలను నిర్దేశించిన ముఖ్యమంత్రి*


*జిల్లాలను ప్రమోట్ చేయండి... పెట్టుబడులను ఆకర్షించండి*

*స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగులిస్తాం*

*కమిట్మెంట్... కన్విన్స్... కో-ఆపరేట్*

*పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3C ఫార్మూలను నిర్దేశించిన ముఖ్యమంత్రి*

*అమరావతిలో క్రియేటీవ్ సిటీ, హిందూపూర్‌లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ప్రకటన*

*6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పెట్టుబడులు, టూరిజం శాఖలపై సీఎం సమీక్ష*

*అమరావతి, మార్చి 12:-* పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా... జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్‌తో పెట్టుబడిదారులను అన్వేషించి... పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి... ముందుకు వచ్చిన వారికి పూర్తిగా కో-ఆపరేట్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు 3C ఫార్మూలను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజున ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. పెట్టబుడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే... స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజిజయన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారు. రీజియన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్ పోర్టు లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

*పెట్టుబడులపై జిల్లాల్లోనూ సమావేశాలు పెట్టాలి*

“పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టింది... వారినీ గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం... ఎకో సిస్టం కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాల్లో టూరిజం ప్రమోట్ చేయాలి... లేదా ఐటీని ప్రమోట్ చేయాలి... ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి.. అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి. ఇలా ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలి. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు... మంత్రులు అనుకోకూడదు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలి. ఇదే విధంగా హైదరాబాద్ ను ప్రమోట్ చేయడం వల్లే ISB వచ్చింది. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హిందుపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.

*ఆతిథ్య రంగంలో అభివృద్ధికి ఆస్కారం*

“ఏపీలో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. అందుకే పర్యాటకానికి పారిశ్రామిక హోదాను కల్పించాం. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో అనేక చరిత్రాత్మక ప్రాంతాలు.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసే అంశంపై ఫోకస్ పెట్టాలి. పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి.. వాటికి ఎంతో చరిత్ర ఉంటుంది.. వాటిని ఎంకరేజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు సిద్ధం కావాలి. వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలు పెద్ద ఎత్తున రావాలి. కన్వెన్షన్ సెంటర్లు, మైస్ సెంటర్లు నిర్మాణం చేయాలి. యుద్ధ ప్రభావాల నేపథ్యంలో విదేశాల కంటే స్థానికంగా ఉండే పర్యాటకానికి పెద్దఎత్తున ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయాలు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు... మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలు వాటిని అభివృద్ధి చేయాలి. పాపికొండలు, గండికోట భారత్ కే గ్రాండ్ కాన్యన్, సూర్యలంక మరో గోవాగా తయారవుతుంది. జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి. టూరిజం ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయటంతో పాటు మాన్యుమెంట్లను కూడా అభివృద్ధి చేయాలి. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుంది. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు. పులికాట్ సరస్సులో పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మక కంపెనీలకు అప్పగించి అభివృద్ధి చేయాలి. స్థానికుల్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుంది. జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ కోసం గదులు నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే ల్యాండ్ అలాట్మెంట్ లో 5 ఎకరాల వరకూ కేటాయింపులు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆథరైజేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐ ల్యాండ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో కంటెంట్ క్రియేషన్ చేసే వారిని ప్రొత్సహిస్తాం. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్ద పీట వేస్తాం. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ పెరిగేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
Read More
0
0 Views 0 Shares 0 Comments
దివ్యాంగ బాలికలు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత చదువులు కొనసాగించాలి: డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద. దివ్యాంగ బాలికలు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత చదువులు కొనసాగించాలి: డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద.
నంద్యాల (AIMA MEDIA ): అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల పాఠశాల బాలికలకు కుట్టు నైపుణ్య శిక్షణ కోసం రెండు కుట్టు మిషన్లు విరాళంగా అందజేశారు. నంద్యాల మహిళా వైద్య విభాగం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నర్మద, అధ్యక్షురాలు డాక్టర్ మాధవి ల సౌజన్యంతో ఈ కుట్టు మిషన్లు అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్యులు ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడంతోపాటు సామాజిక బాధ్యతలో భాగంగా విస్తృత సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద మాట్లాడుతూ దివ్యాంగ బాలికలు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత చదువులు కొనసాగించడం అవసరం అన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే సహకారం వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వారి అభివృద్ధికి తమ సహకారం కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నవజీవన్ బధిరుల పాఠశాల బాల బాలికలు, పాఠశాల నిర్వాహకులు భాస్కర్,రాజశేఖర్, సిస్టర్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.
Read More
0
87 Views 0 Shares 0 Comments
15 मार्च तक कार्य पूरे करने के निर्देश 15 मार्च तक कार्य पूरे करने के निर्देश
लालसोट

सहायक निदेशक कृषि (विस्तार) अशोक कुमार मीणा ने किसान सेवा केंद्र भवन लालसोट, रामगढ़ पचवारा और बिलौना कला में सहायक कृषि अधिकारियों व कृषि पर्यवेक्षकों की बैठक लेकर विभागीय योजनाओं की प्रगति की समीक्षा की।

बैठक में फार्म पौड निर्माण, काँटेदार तारबंदी, सिंचाई पाइपलाइन, कृषि यंत्र, गोवर्धन जैविक उर्वरक योजना, भूमिहीन कृषि श्रमिक योजना, राष्ट्रीय प्राकृतिक खेती मिशन, परंपरागत कृषि विकास योजना, प्रधानमंत्री फसल बीमा योजना, जिप्सम वितरण, फसल प्रदर्शन और मिनीकिट्स वितरण सहित विभिन्न योजनाओं पर चर्चा की गई।

मीणा ने सभी लंबित कार्य 15 मार्च तक पूर्ण करने तथा स्वीकृत कार्यों का पोस्ट वेरिफिकेशन कर पात्र किसानों को समय पर अनुदान दिलाने के निर्देश दिए। साथ ही किसानों को विभागीय योजनाओं की जानकारी देकर अधिक से अधिक किसानों को लाभान्वित करने पर जोर दिया।

बैठक में सहायक कृषि अधिकारी शिवकुमार मीणा, रामखिलाड़ी मीणा, दिनेश कुमार सैनी सहित कृषि पर्यवेक्षक मौजूद रहे।
Read More
1
0 Views 0 Shares 0 Comments