అంగన్వాడీ కేంద్రాలు స్కూల్. ప్రభుత్వ కార్యాలయాలు కాపాడాలని ధర్నా
అంగన్వాడీ కేంద్రాలు స్కూల్. ప్రభుత్వ కార్యాలయాలు కాపాడాలని ధర్నా
అంగన్వాడి స్కూలు, ప్రభుత్వ కార్యాలయాలు కాపాడాలని ధర్నా చేపట్టడం జరిగింది.
మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న.
======================
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం గ్రామంలో జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా చేపట్టడం జరిగింది. ముందుగా ఎమ్మార్వో ఆఫీస్ నుంచి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా రాఘవేంద్ర స్వామి సింహ ద్వారా వరకు మరియు అక్కడ నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి రాఘవేంద్ర సర్కిల్లో ధర్నా చేపట్టడం జరిగింది. తదనంతరం ఎమ్మార్వో తాసిల్దార్ ) కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో( తహసిల్దార్ ) కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న మాట్లాడుతూ మంత్రాలయంలో మరియు పరిసర ప్రాంతాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం భూములే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, అంగన్వాడి స్కూల్స్ అయితేనేమి పక్క భవనాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యం అంగన్వాడి స్కూలుకు, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేస్తామని వారిని బెదిరించడం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యం ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలా ఉన్న వాటిని ఖాళీ చేసి పొమ్మని చెప్పడం సబబు కాదు అని లక్ష్మన్న చెప్పారు.
సంస్కృత పాఠశాల ఎదురుగా పశువుల ఆసుపత్రి ఉండేది ఇక్కడ దానిని కూడా పీకేశారు. ఎంఈఓ కార్యాలయాన్ని కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యం వారు కాళీ చేయండి లేదా ఆఫీస్కు తాళాలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. మంత్రాలయం గ్రామ ప్రజల యొక్క బాగోగులు చూసి, ప్రజల కొరకు, స్కూల్ విద్యార్థుల కొరకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడి బడిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత శ్రీరాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యంపై ఉంది అని విలేకరుల సమావేశంలో తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు గాని పరిరక్షించాల్సిన బాధ్యత రాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యానికి ఉందని వారికి మీ ద్వారా విన్నవించుకుంటున్నానని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్ద కడూరు మండల అధ్యక్షులు జి బజార్ అప్ప, కోసిగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సి వీరారెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ మండల అధ్యక్షులు బివి రవిచంద్ర, చంద్ర, నాగరాజ్, భీమన్న, రంగస్వామి, రమేష్, రామాంజి, మహేష్, జగదీష్, నరసన్న, నారాయణ, రాగు, గిడ్డయ్య, ఏసోబు, ఈరన్న,హనుమన్న, లింగప్ప, పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Read More
|