నాటిక కళారంగాన్ని బ్రతికించడం అభినందనీయం
ప్రముఖ నేపద్య గీత రచయిత కాసర్ల శ్యామ్
తొర్రూరు మార్చి 14; (AIMEMEDIA ) నాటక కళారంగాన్ని బ్రతికించడం అభినందనీయమని ప్రముఖ నేపథ్య గీత రచయిత కాసర్ల శ్యామ్ అన్నాడు శుక్రవారం రాత్రి తుర్రుపట్టణంలో చైతన్య కళాని సమాఖ్య ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన నాటక పోటీల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మమ్మల్ని బతకనీయండి నాటికను ప్రదర్శించారు అనంతరం జరిగిన ముగింపు సమావేశం అధ్యక్షుడు మన్నూరు ఉమా వహించగా ప్రధాన కార్యదర్శి పినాక పాణి మన్నూరు ఉమా లు మాట్లాడుతూ
1985 సంవత్సరంలో మొదలైనటువంటి యొక్క చైతన్య కళా సమాఖ్య ఇప్పటికీ 40 సంవత్సరాలు దాటి 41 సంవత్సరంలో అడుగు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తూ కొంతకాలం పాటు కళా ప్రదర్శనలు కూడా ఇస్తూ ఈరోజు కళా ప్రదర్శనలు ఇవ్వడానికి ఇబ్బందులు కళాకారులు సుదూరంగా ఉన్నటువంటి కళాకారులను పిలిపించి ఇక్కడ జాతీయస్థాయిలో నాటకాలు వేయించామని, ముఖ్యంగా కళాపోషకులు దాతల సహకారంతో ఈ 14వ జాతీయ స్థాయి నాటక పోటీలను ఇన్నేళ్లుగా నిర్వహిస్తున్నామని సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న మన్నారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ కలలను బ్రతికించాలని చెప్పడంతో సమాఖ్య అధ్యక్షులు మన్నూరు ఉమా ఆధ్వర్యంలో సభ్యులు కల రంగానికి సేవలు అందిస్తూ కళాకారులను ప్రోత్సహించడం సుదూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి కళాకారులు తమ ప్రదర్శనలు చేయటం ఎంతో గొప్ప విషయం అన్నారు.. ఈ కార్యక్రమంలో బి అమరేంద్ర, శశి మోహన్లు ఐదు రోజుల నాటికలకు వివరించి ఫలితాలను సమావేశంలో అధ్యక్షులు అందజేశారు ప్రకటించిన ఫలితాలు ఇలా ఉన్నాయి ఉషోదయ కళానికేతన్ కట్లపాడు వారు ప్రదర్శించిన మంచి మనసులు నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక కాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా స్వర్ణ సూర్య లవర్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన స్త్రీ మాత్రే నమః లభించింది అలాగే ఉత్తమ దర్శకులుగా అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ఉత్తమ దర్శకులుగా డాక్టర్ వెంకట్ గోవాడ ఉత్తమ రచయితగా మంచి మనసులు నాటిక రచయిత చెరుకు సాంబశివరావుకు ఉత్తమ నటుడు గా మమ్మల్ని బతకనీయండి నాటికలో ముత్యాలరావు పాత్రధారి ఈ.ఎస్ పవన్ కుమార్ ఉత్తమ నటి తితిక్ష నాటికలో సహన పాత్రధారి జి.ఎం.డి కుసుమ ఉత్తమ హాస్యనటుడు రామారావు పాత్రధారి భాస్కర్ క్యారెక్టర్ నటుడు తితిక్ష నాటికలో ఉత్తమ ప్రతినాయకుడు గుణ వర్ధన్ పాత్రధారి లక్ష్మణ్ శర్మ ఉద్యమ సంగీతం సురభి నాగరాజు సతీష్ ప్రత్యేక బహుమతులు గెలుచుకున్న వారు పత్తి సాయిబాబు గెలుచుకున్నారని న్యాయ నిర్ణేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. చివరి రోజు ప్రదర్శించిన నాటిక మమ్మల్ని బతకనీయండి ఆద్యంతం ఉద్వేగంతో నటీనటులు నటించిన తీరు ప్రేక్షకులను ఆలోచింపజేసింది ముఖ్యఅతిథిగా పాల్గొన్న నేపధ్య గీత రచయిత పాస్టర్ల విషయం తను ఎలా ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నాడో చెబుతూ తాను రచించిన కొన్ని గీతాలను ఆలపించారు 47 గా నాటక కలను సంరక్షిస్తూ ఈ స్థాయిలో ప్రశంసలు పొందడానికి కారణమైన అధ్యక్షుడు మన ఊరి ఉమా ఎంతో గొప్ప ఆలోచన పరుడని ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు ప్రశంసలు అందజేశారు ఇన్నేళ్లుగా తనకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి తన మిత్రులను గుర్తు చేసుకుంటూ సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు బొంపల్లి లక్ష్మణరావు, లింగాల వెంకట్ నారాయణ గౌడ్ జినుగా సురేందర్ రెడ్డి, మంగళంపల్లి శ్రీనివాస్, గడల శ్రీనివాస్ జనార్దన్ రాజు , సాహిత్య కార్యదర్శి ఇమ్మడి రాంబాబు పి రవి ,ఎల్ వెంకట్ రెడ్డి సహాయ కార్యదర్శి ఎం వెంకన్న దాతలు సర్వి వెంకన్న పనస మధు కౌన్సిలర్ చకిలేల అలివేణి, కత్రోజు పద్మ , వజినపల్లి పెళ్లి ఉదయ్ శ్రీ మనోజ్, భాస్కరాచారి, మహిళలు ప్రేక్షకులు పాల్గొన్నారు