logo

జిహెచ్ఎంసి ఎలక్షన్ లో బిజెపి అభ్యర్థి అకాల మరణం.

హైదరాబాద్:నిన్న మక్తల్ మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఎన్నికల ప్రచారం సభ జరిగింది. ఆ మరుసటి రోజే 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవయ్య బలవన్మరణం చెందిన వార్త కలచివేసింది. మహాదేవప్ప మృతికి కారణం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి. మంత్రి శ్రీహరి బెదిరింపులతోనే సూసైడ్ చేసుకున్నారని అర్థమౌతుంది.

పోటీ చేయవద్దని బెదిరింపులకు దిగడంతో భయపడి చనిపోయారు. పోలీసులు తప్పుడు రిపోర్ట్ రాసి.. కుటుంబ సభ్యులకు చదివి వినిపించకుండానే సంతకం తీసుకున్నారు.

పోలీసులు ఆ రిపోర్ట్ లో.. ఓట్లు పడవనే భయంతో నా భర్త చనిపోయాడని మహదేవప్ప భార్య చెప్పినట్లు రాసి.. ఆమె సంతకం తీసుకోవడం జరిగింది. 

ఇంతకన్నా ఘోరం ఇంక ఏం ఉంటుంది ?

మృతదేహాన్ని పక్కన పెట్టుకొని, అంత త్వరగా రిపోర్ట్ రాయించుకోవాల్సిన అవసరం పోలీసులకు ఏం వచ్చింది ? 

బెదిరింపులకు గురి చేసి మహాదేవప్ప మరణానికి సీఎం, మంత్రి కారణం అయితే.. పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా అధికారులు ప్రయత్నం చేసారు. 

ఇక్కడి అధికారులపై నమ్మకం లేదు. మంత్రికి, ముఖ్యమంత్రికి  అధికారులు పూర్తిగా తొత్తులుగా మారారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇక్కడి అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

ఈ వార్డు ఎన్నికను పోస్ట్ పోన్ చేసి.. తర్వాత ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఇక్కడి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

0
89 views