logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అయ్యప్ప–హనుమాన్ స్వాములకు అన్నప్రసాద కార్యక్రమానికి బిలీఫ్ హాస్పిటల్ విరాళం.

Hyderabad City / Telangana

అయ్యప్ప–హనుమాన్ స్వాముల ఆశీస్సులతో రమజ్యోతి సామ్య తండా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి బిలీఫ్ హాస్పిటల్ విరాళం అందజేసింది. అయ్యప్ప–హనుమాన్ స్వాముల సన్నిధిలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.
బిలీఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, బిలీఫ్ హాస్పిటల్ ఫౌండర్ మరియు లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలైన శ్రీమతి రమా జ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ గురుస్వామి స్వాములకు భీముడు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాఫీగా, విజయవంతంగా జరిగింది.

శ్రీమతి రమా జ్యోతి గారు దయ, వినయం, సరళతతో కూడిన వ్యక్తిత్వంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సేవే పరమధర్మంగా భావిస్తూ, బిలీఫ్ హాస్పిటల్ ద్వారా పేదలు, నిరుపేదలు మరియు అవసరమైన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషి అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోంది.

అదేవిధంగా లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు, విద్యా సహాయం మరియు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగుతున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు బిలీఫ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా శ్రీమతి రమా జ్యోతి గారిని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, అయ్యప్ప–హనుమాన్ స్వాముల కృపతో ఆమె సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, సమాజానికి ఇంకా ఎక్కువ మేలు చేయాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు గురుస్వాములు బిలీఫ్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

43
1352 views

Comment