logo

సౌదీలో బస్సు ట్యాంకర్ యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం.

హైదరాబాద్:సౌదీలో ఘోర బస్సు ప్రమాదం చాలా బాధాకరం -

42 మంది సజీవదహనం.. హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం...

మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం...

మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించిన అధికారులు బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలు....

మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.. ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి...

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతుల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతోపాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు మాట్లాడడం జరిగింది. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు....

బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు...

+91 79979 59754
+91 99129 19545

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత....!!!!

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనం.. మృతుల్లో హైదరాబాద్‌ మల్లేపల్లి బజార్‌ ఘాట్‌కు చెందిన 16 మంది.. మృతులు: రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూరు, మహ్మద్‌ అలీగా గుర్తింపు....

#CMOTG #CMRevanthReddyGaru #SaudiBussAccident #TPCCNRICell #vishnuvardhanreddygangireddy #vishnutvtelugu

4
190 views