logo

పాకిస్తాన్ పైన భారత్ ఘనవిజయం.



ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్ (69), దూబే (33) రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో తిలక్ అద్భుతంగా పోరాడి చిరస్మరణీయ విజయాన్నందించారు. పాక్ బౌలర్లలో అష్రఫ్ 3, అఫ్రిదీ, అబ్రార్ తలో వికెట్ పడగొట్టారు.

19
518 views