logo

శ్యామ్ ముఖర్జీ ప్రసాద్ వర్ధంతి వేడుకలు.

హైదరాబాద్ : 23.06.2025
రంగారెడ్డి.

భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు Dr. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా నాగోల్ డివిజన్ లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.

ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ గారు వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి, మొక్కలు నాటారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ...

Dr.శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు భారతదేశంలో హిందూ జాతీయ వాదాన్ని బలంగా నినాదించిన నాయకులని,*""అఖండ భారత దేశం""* సంకల్పంతో ఉద్యమాలు చేసిన బలమైన నాయకులు...
సామాజిక కార్యకర్తగా..న్యాయవాదిగా..రాజకీయ నాయకుడిగా అనేక ఒడిదుడుకులను, ఒత్తిళ్లన్లు తట్టుకొని సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన మహా నాయకుడు..

స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్లో పారిశ్రామిక సరఫరాల మంత్రిగా ఉంటూ...భారతదేశ నుండి కాశ్మీర్ ను ఆర్టికల్ 370తో వేరు చేసినప్పుడు నెహ్రూతో విభేదించి.. రాజీనామా చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని గట్టిగా నినాదాంచి..
కాశ్మీర్లో అడుగుపెట్టిన ధైర్యసాలి..కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైల్లో వేసి చిత్రహింసలకు గురిచేసి హతమార్చింది..

1953 జూన్ 23న దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ మహనీయులని వారు కొనియాడారు..

ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు , అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ గారు,హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి గారు, నాగోల్ డివిజన్ చింతల అరుణాసురేందర్ యాదవ్ గారు, మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

0
0 views