logo

ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ జరగని విధంగా ప్రధాని మోది పిలుపు మేరకు 21వ తారీకు న జరిగిన యూగాంద్ర సుందర నగరం అయిన విశాఖ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరియు ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్. మరియు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు కలిసి నిర్వహించిన ఈ 11వ అంతర్జాతీయ యోగా డే , ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం విశాఖ వైపు చూసే విధంగా మంత్రి లోకేష్ బాబు ఎంతో శ్రమించి ఈ కార్య క్రమం నిర్వహించి రెండు గిన్నిస్ రికార్డు లు సాధించారు ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు చాలా గర్వకారణం

నగరి, చిత్తూరు [22-06-2025]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "యోగాంద్ర"రికార్డ్ సష్టించింది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని సుందర నగరం అయిన విశాఖ పట్టణం వేదికగా నిర్వహించిన యోగాంద్ర గిన్నిస్ రికార్డు సాధించింది,3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు
గతంలో సూరత్ లోనిర్వహించిన యోగా రికార్డ్ ను,1.47 లక్షల మంది ఈ రికార్డను బద్దలు కొట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం లో అర్. కే. బీచ్ నుండి భీమిలి బీచ్ వరకూ ఓకె మార్గంలో లక్షల మంది యోగాసనాలు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు
ఈ రికార్డు ను ప్రధాని మోధి గారి సమక్షంలో ఈ యోగాడే కార్యక్రమం జరిగింది

*లోకేష్ ను ప్రత్యేకంగా ప్రధాని మోది గారు అభినందించారు ఈరోజు ఈ రికార్డ్ సృష్టించింది అంటే లోకేష్ కి లభించిన గొప్ప గుర్తింపు, లోకేష్ ఆలోచన దానిని ఆచరణలో పెట్టడానికి గత నెలన్నర రోజులుగా ఆయన చేసిన అవిశ్రాంత కృషి కి అభినందనీయం అని కొనియాడారు
రెండు గిన్నిస్ రికార్డు లు 21 వరల్డ్ బుక్ రికార్డ లతో గ్రాండ్ సక్సెస్. విశాఖ లో ఓకె ప్రాంతంలో 3.02.087మంది యోగాసనాలు వేసినందుకు ఒక గిన్నీస్ రికార్డు

*ఒకేసారి ఒకేచోట22.122మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారం చేసినందుకు మరో గిన్నిస్ రికార్డు ఈ రెండు రికార్డులు సాధించడం మన రాష్ట్రానికి గర్వకారణం అని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు

21
2097 views