logo

జాతీయ భద్రత కు విఘాతం కలిగించే విధంగా రేవంత్ వ్యాఖ్యలు.. _బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్



తొర్రూరు మే 30 (AIMEDIA)నిన్న జరిగిన జైహింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైనవని, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయ ని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ తొర్రూరు మండల మాజీ అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శుక్రవారం వపహల్గావ్ ఉగ్ర దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ లో ఉన్న 9ఉగ్రవాద స్థావరాలను పూర్తి స్థాయిలో ద్వంసం చేసి వంద మంది ఉగ్రవాదుల ను అంతం చేసి, ఉగ్రవాదుల ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లోని 11ఏయిర్ బేస్ లను నేలమట్టం చేసి పాకిస్థాన్ కు కోలుకోలేని రీతిలో చావుదెబ్బ తీశారనిఈఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడి భారత్ వైపు చూసింది అని,ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మాత్రం ఆపరేషన్ సిందూర్ విజయాన్ని,మన త్రివిధ దళాల సత్తా ను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని, సాక్షాత్తు పాకిస్థాన్ ప్రధానమంత్రి భారత్ పై దాడులు చేయాలని అనుకునే లోపే భారత్ మాపై ఊహించని రీతిలో క్షిపణి దాడులు చేసి కోలుకోలేని నష్టం చేసింది అని, చావుదెబ్బ తీశారు అని చెబుతుంటే రేవంత్ రెడ్డి కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం దుర్మార్గంగా ప్రధాని నరేంద్ర మోడీ పై,మన త్రివిధ దళాల శక్తి సామర్థ్యాల పై అనుమానం రేకెత్తించేలా మాట్లాడడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420హామీలను అమలు చేయడం చేతకాక,మంత్రివర్గ విస్తరణ చేసుకునే దమ్ము లేక, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని,తీవ్ర మనోవేదన లోనై నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరని, తెలంగాణ ఆడపడుచుల తో విదేశీ అందాల భామల కాళ్ళు కడిగించి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని,పౌరుషాన్ని,పరాక్రమాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి జాతి వ్యతిరేక,ధేశ వ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరేమీ ఆశించలేం అని ఆరోపించారు.డిల్లీకి పోయి వచ్చిన ప్రతీసారి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల నుంచి తనను తాను రక్షించుకోవడానికి గల్లీలో చిల్లర మాటలు మాట్లాతుంటాడని, రేవంత్ రెడ్డి కి పోయే కాలం దగ్గర పడిందని అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని పల్లె కుమార్ ఆరోపించారు.రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో గాడి తప్పిన పాలన,అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తి తీవ్రం గా నష్ట పోయిన రైతులను ఆదుకోవడం పై , విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్నా ఇప్పటికీ పాఠశాలలో కనీస, మౌళిక సదుపాయాలు లేక కనీసం టాయ్లెట్స్, మంచినీరు కూడా లేక వెక్కిరిస్తున్న ప్రభుత్వ విద్యారంగం,ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ అందక గత ఏడాదిన్నర కాలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలు తీర్చడానికి ద్రృష్టి సారిస్తే మంచిదన్నారు. నిరంతర అభివృద్ధి ప్రధాత భారత్ ను విశ్వ గురువుగా చేయాలనే సంకల్పంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ని విమర్శించే స్థాయి,అర్హత రేవంత్ రెడ్డి కి లేదని, నరేంద్ర మోడీ పెద్ద శిఖరం అని,రేవంత్ రెడ్డి అందులో రవ్వంత మాత్రమే అని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.

4
234 views