logo

టీ జి ఎఫ్ *రజతోత్సవ సభను విజయవంతం చేయండి రజత ఉత్సవ సభ గోడపత్రిక ఆవిష్కరణ

తొర్రూరు 27 (AIMEDIA)
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని 143H రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఆర్ లెనిన్ పిలుపునిచ్చారు. తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో మంగళవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రజతోత్సవ వేడుకల గోడపత్రికను టి యు డబ్ల్యూ జే 143 హెచ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టుతో కలిసి లెనిన్ మాట్లాడుతూ ఈనెల 31న హైదరాబాద్ ప్రాంతంలోని స్థానిక జలవిహార్ ఆడిటోరియం వేదికలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25వ వసంతాల సంబరాలను జరుపుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్టు మిత్రులందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి టీజేఎఫ్ ముందుంటుందని తెలుపుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం టీజేఎఫ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ తీగల కృష్ణారెడ్డి, 143 హెచ్ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వినోద్ రెడ్డి,జర్నలిస్టు సంఘం నాయకులు దేవరకొండ కృష్ణ ప్రసాద్, నన్నపు రాజు నారాయణ రాజు,ఆకుతోట యాకయ్య, సదాశివరావు, , ఇమ్మడి రాంబాబు, బందు శ్రీధర్,సాదు సుమన్,సిరికొండ విక్రమ్ మహమ్మద్ అమీర్, వెల్తూరి పూర్ణచందర్, నాల్లం శ్రీనివాస్, యశ్వంత్,సైదులు, రమాకాంత్, శివ, మనోహరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

4
199 views