logo

భద్రాచలం శ్రీ రామదాసు అర్చకులు తెలంగాణ సీఎంనే కలవడం జరిగింది.

హైదరాబాద్ : భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన మంత్రి కొండా సురేఖ గారు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు.

సీఎం గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఆహ్వానం అందించారు.

భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి గారు, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

0
132 views