logo

అర్ధ శతబ్దాపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం,

తొర్రూర్ :సెప్టెంబర్ 5(AIMA MEDIA ) అర్ధ శతబ్దాం తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ను ఘనంగా నిర్వహించుకున్నారు. గురువారం పట్టణం లో జడ్పీఎసె స్ పాఠాశాల లో 1974-75 లో ఎస్ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు, 40 మంది స్థానికంగా అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. తాము సుదీర్ఘకాలం తర్వాత, కలుసుకున్న మిత్రులందరూ తమ తమ అనుభవాలను, తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరి తో ఒకరు పంచుకొని ఆత్మీయతను చాటుకున్నారు. తమ నుండి గతించిన తోటి విద్యార్థులకు ఉపాధ్యాయుల కు అంజలి ఘటించారు.50 సంవత్సరాల తరువాత విడిపో యిన తమ స్నేహితులను ఒక వేదిక మీదికి చేర్చడం ఒక అద్భుతం అని తమ జీవితం లో మరుపురాని ఘట్టం గా గుర్తుపెట్టుకుంటామన్నారు. తమ కు 64 సంవత్సరాలు ఉంటాయని, తాము 5 తరాలను చుసినవారవడం, మేము మరల కలుసుకొని మాట్లాడుకోవడం, నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు తమ గురువులు ప్రధానోపా ధ్యాయులు గంట రామ్ రెడ్డి, అనుమాండ్ల వెంకట్ రెడ్డి,పి కిషన్ రావు లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి లు అర్థ శతాబ్దం తర్వాత అందరిని ఒకే చోట కలుసుకునే విధంగా చేసిన ఆర్గనైజర్ లను అభినందించారు.

38
1514 views