logo

వరద ముంపు ప్రాంతం లో అన్న ప్రసాద వితరణ

తొర్రూర్ 3(AIMA MEDIA ) పట్టణం లో గత రెండు రోజులు గా కురసిన వర్షానికి, వరద భాదితులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయ్ లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రుర్ సేవా తరుణి వారి ఆధ్వర్యంలో డిస్టిక్ కాబినెట్ మెంబెర్, మాజీ అధ్యక్షురాలు లయన్ వజినపల్లి శైలజ ఎంజేఫ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి ఆర్థిక సహకారంతో బీరప్ప నగర్ వరద ముంపు ప్రాంతాలలో 100 మంది అవసరార్థులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. కోఆర్డినేటర్, చార్టర్ ప్రెసిడెంట్ వి . శారదా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వరద ప్రాంతాలలో ఈ విధమైన సేవా చేయడమే మా లయన్ యొక్క లక్ష్యం అన్నారు. డి. సి .ఎస్ నాగవాణి వరద ముంపు ప్రాంతాల ప్రజలకు మీరు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారికీ మా లయన్స్ క్లబ్ ఎప్పటికీ సాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఏ రాధిక, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ .టి . శ్రీదేవి, క్లబ్ సభ్యులు ఆర్.సబిత తదితరులు పాల్గొన్నారు

7
2995 views