logo

కేకే లైన్‌లో జారిపడిన బండరాళ్లు.. అప్పుడే గూడ్స్ రైలు రావడంతో!

Kk Line Boulders Fall On Track: అల్లూరి సీతారామరాజు జిల్లా కేకే లైన్‌లో శివలింగపురం దగ్గర రైల్వే ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి. ఒక బండరాయిని ఢీకొని గూడ్స్‌ రైలు ఇంజిన్‌ దెబ్బతింది.. ఈ ప్రభావంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటనతో ఎస్ కోట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. వెంటనే సిబ్బంది ట్రాక్‌ను రిపేర్ చేసి రైళ్ల రాకపోకల్ని క్లియర్ చేశారు.

ప్రధానాంశాలు:

కేకే లైన్‌లో జారిపడ్డ బంగారళ్లు
ఓ రాయిపైకి ఎక్కేసిన గూడ్స్ రైలు
రైళ్ల రాకపోకలకు అంతరాయం

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కేకే (కొత్తవలస-కిరండోల్‌) లైన్‌లో రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు జారి పడ్డాయి. బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పై రాళ్లు పడిపోగా.. అదే రూట్‌లో కొద్దిసేపటికి జంబో గూడ్స్‌ ఇంజన్‌ వచ్చింది బండరాయిపైకి ఎక్కి ఒక్కసారిగా ఆగిపోయింది. బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య 41వ కిలోమీటరు దగ్గర ఈ ఘటన జరిగింది. బండరాళ్లు పడిపోయాయని సమాచారం రావడంతో రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
బండరాయిపైకి ఎక్కిన ఇంజన్‌ తొలగించి, ట్రాక్‌ పునరుద్ధరణ పనులను చేపట్టారు. అక్కడ విరిగిపోయిన ట్రాక్‌కు సంబంధించిన ఐరన్‌ కమ్మిని మార్చారు. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి కిరండోల్‌ వెళ్లాల్సిన పాసింజర్‌ రైలును విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో దాదాపు ఐదు గంటలపాటు నిలిపి వేయాల్సి వచ్చింది. బండరాళ్లు జారిపడే సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో కూడా ఈ కేకే లైన్‌లో బండరాళ్లు పడిపోయి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ రూట్‌లో వర్షాకాలంలో ఎక్కువగా బండరాళ్లు జారిపడుతుంటాయి.

6
636 views