logo

నంద్యాల అభివృద్ధి చేసే బాధ్యత నాది - ఎన్ఎండి ఫరూక్

*తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం*

*11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్ఎండి ఫరూక్*

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ పట్టణంలో ని 11వ వార్డు ఇంచార్జీ కట్టెల ఆఫ్జల్ & మాజీ కౌన్సిలర్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో గడప గడప కు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు!

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి & టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఖలీల్ (బబ్లు) మరియు డాక్టర్ బాబాన్

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆయన రాజకీయ జీవితం చాంద్ బడా నుంచే మొదలు అయ్యింది అని గుర్తు చేసుకున్నారు ఇక్కడి ప్రజలు గత 3 దశాబ్దాల నుంచి తనకు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు..ఈ చంద్ బాడలో పార్క్, టౌన్ హాల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మరియు మంచి నీటి సదుపాయం కోసం పెద్ద SS ట్యాంక్ ను నిర్మించిన విషయాన్ని ప్రజల ముందు వుంచారు ఇదే కాక ఇక్కడ రోడ్లు , డ్రైనేజీలను చాలా వరకు నిర్మించారు అని గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుతం వున్న వైసిపి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని ఫరూక్ గారు విమర్శించారు. కనుక రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ టీడీపీ ప్రభుత్వాన్నికి తమ అమూల్యమైన ఓట్లను వేసి వేయించి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను (ఎన్ఎండి ఫరూక్ ) , నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ప్రజలను సవినయంగా విజ్ఞప్తి చేశారు...

ఈ కార్యక్రమంలో తిరివిధి ప్రసాద్, తిరివీధి మణికంఠ, మన్సూర్, గురప్ప.మదర్, మహబూబ్ బాషా, హుస్సేన్ బాషా, టీడీపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు..

0
1066 views