logo

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం



సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే
చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను
ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం
సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా
పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు
సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని
అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ
భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ
గంధాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పిస్తారు.

3
709 views