logo

AIMA విజయనగరం జిల్లా కొత్తవలస స్కూటీ డిక్కీలో రూ.ఆరు లక్షల మాయం కొత్తవలస:స్కూటీ డిక్కీలో ఉంచిన రూ. 8 లక్షలు మాయ

AIMA
విజయనగరం జిల్లా
కొత్తవలస

స్కూటీ డిక్కీలో రూ.ఆరు లక్షల మాయం

కొత్తవలస:స్కూటీ డిక్కీలో ఉంచిన రూ. 8 లక్షలు మాయమయ్యాయి. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.లక్కవరపుకోట మండలంలోని దాసుళ్లపాలెం గ్రామానికి వెళ్లే రహదారిలో నివాసముంటున్న వెలివెల రామకృష్ణ భవాని శర్మ కొత్తవలసలోని జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ లాకర్ ఉంది. సోమవారం మధ్యాహ్నం లాకర్లోని ఎనిమిది లక్షలు తీసుకుని లక్ష రూపాయలను బ్యాంక్లో డిపాజిట్ చేసి మిగిలిన సొమ్మును స్కూటీ డిక్కీలో పెట్టాడు. విశాఖ రహదారిలోని దుర్గా దేవి ఆలయం ముందు స్కూటీ ఉంచాడు. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న తమ్ముడు శ్రీనివాసరావుకు మరో లక్ష రూపాయలను ఇవ్వడానికి డిక్కీలో నుంచి తీశాడు.ఆలయంలోకి డబ్బులు పట్టుకొనివెళ్లి శ్రీనివాసరావుకు ఇచ్చిన 10 నిమిషాల తరువాత వచ్చి డిక్కీ తెరచి చూశాడు. మిగిలిన ఆరు లక్షల రూపాయలు కని పించలేదు. దీంతో సోమవారం డబ్బులు పోయిన వెంటనే బాధితుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ బాల సూర్యారావు కేసు నమోదు చేశారు. బాధితుడ్ని మొదటి నుంచి ఎవరో అజ్ఞాతవ్యక్తి అనుసరించి చోరీకి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన విజయనగరంలోని ఇంటికి సంబంధించి అడ్వాన్స్ ఇచ్చిన సొమ్మును బ్యాంక్ లాకర్లో దాచుకున్నట్లు బాధితుడు తెలిపాడు. అప్పులు తీర్చడంకోసం లాకర్లో ఉన్న సొమ్మును తీసినట్లు చెప్పాడు. చోరీ విషయమై విజయనగరం సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

27
2572 views
  
1 shares