logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
ELURU VENKATA RAMANA(RAJESH KUMAR SHARMA)
All India Media Association

బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వైజాగ్ నుంచి బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది అతనికి సోషల్ వర్కర్ అవార్డు మరియు జ్యోతిష్య పండిత్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఎంతోమంది బ్రాహ్మణులకు వైజాగ్ లో సేవలందిస్తున్న ఇందుకుగాను మరియు ఎంతోమంది పురోహితులకు మరియు అర్చకులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నందుకుగాను ఎంతోమంది దేవాలయ పరంగా వచ్చిన భక్తులకు మరియు ఆన్లైన్ జ్యోతిష్య జాతక వాస్తు ముహూర్తాలు సహకారాలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది.బ్రహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులంత కలిసి ఐక్యంగా విజయ పథంలోకి తీసుకోని వెళుతున్న బ్రహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు ఇదే మా అభినందన మందారాలు అని కార్యవర్గ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు ఇతరులు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ పెందుర్తి తరపు నుండి ఉత్తమ సోషల్ వర్క్ అవార్డు మరియు ఉత్తమ జ్యోతిష్య జాతక వాస్తు పండిట్ అవార్డులను కైవసం చేసుకున్న మన వైజాగ్ బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మ. చదువుకోవాలని ఉన్న ఆర్ధిక స్తోమత లేని, బ్రహ్మణ పిల్లలకి గురువు అయి స్కాలర్షిప్ ద్వారా చదువుకి సహాయం చేస్తున్నారు. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలేని స్థితిలో ఉన్న వారికి తాళిబొట్టుతో సహాయం యిచ్చి తల్లి తండ్రి అయి అండగ నిలుస్తున్నారు. బ్రాహ్మణులకు ఇండ్లు పథకాలు పెట్టె ఒక స్నేహితుడి లాగా నేనున్నాను అనే ఒక భరోసాని కల్పిస్తూ కుటీర పరిశ్రమలు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు సాగుతున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక లో తనదైన ముద్రను వేసుకొని మునుముందుకు వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. బ్రాహ్మణులు క్రీడల మరియు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఎన్నో విలుత్వ కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వీధిలో రాజేష్ కుమార్ శర్మ. ఇంత గుర్తింపుకు కారణమైన తన కుటుంబ సభ్యులని తెలియజేయడం జరిగింది. అతి ముఖ్యంగా తన భార్య తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలనని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వైజాగ్ లో ఉత్తరాంధ్ర పురోహిత మిత్రుని స్థాపించడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు వైజాగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాదని తెలియజేయడం జరిగింది.

..........
52
5403 views    0 comment
0 Shares

బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవ హైదరాబాదులో 1st అక్టోబర్ 2023 (ఆదివారం) 9 am నుండి 5 pm గం వేదిక M కన్వెన్షస్, ప్రశాంతి నగర్ కాలనీ, ఉప్పల్ డిపో రోడ్ హైదరాబాద్ వేదికగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వైజాగ్ నుంచి బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. అతనికి సోషల్ వర్కర్ అవార్డు మరియు జ్యోతిష్య పండిత్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. అటు ఎంతోమంది బ్రాహ్మణులకు వైజాగ్ లో సేవలందిస్తున్న ఇందుకుగాను మరియు ఎంతోమంది పురోహితులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నందుకుగాను. ఇటు దేవాలయపరంగా వచ్చిన భక్తులకు మరియు ఆన్లైన్లో జ్యోతిష్య నీ అందిస్తూ వారికి వాస్తు జ్యోతిష్య పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు ముఖ్యఅతిథి

: బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌరవ అతిథి

: శ్రీ పాలేపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు

ప్రత్యేక అతిధులు :
శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ గారు, ప్రఖ్యాత సినీ నటులు

శ్రీ రాకెట్ రాఘవ గారు, ప్రముఖ సినీ నటులు & జబర్దస్త్ ఫేమ్కూ

శ్రీ విష్ణు దాస్ శ్రీకాంత్ గారు, డైరెక్టర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్డా

విశిష్ట ల అతిధులు
శ్రీ పోలప్రగడ జనార్ధనరావు గారు.(జెన్నీ)
ప్రముఖ సినీ, టివీ : శ్రీమతి సునీత గారు సోషల్ వర్కర్

ఆత్మీయ అతిధులు
శ్రీమతి డాక్టర్ దివ్య మాలిని గారు, ప్రముఖ వైద్యురాలు నటులు.


శ్రీ ఎం. లక్ష్మి నరసింహ చార్యులు, బిర్లామందిర్ ప్రధాన అర్చకులు : శ్రీ మల్లికార్జున గారు, ప్రముఖ వ్యాపారవేత్త

శ్రీ మంగపతిరావు గారు, బ్రాహ్మణ సంక్షేమ భవనం సలహాదారులు

సభ అధ్యక్షులు
శ్రీ బాలశ్రీనివాసులు గారు, వ్యవస్థాపక కార్యదర్శి

శ్రీ మోహన్ కుమార్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ V వెంకట కిషన్ రావు గారు, ఉపాధ్యక్షులు

కార్యవర్గ సభ్యులు

శ్రీమతి పావని శర్మ గారు, మహిళాఉపాధ్యక్షురాలు

శ్రీ చొప్పకట్ల రాము గారు, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్

శ్రీ రవి కుమార్ గారు, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్

శ్రీ సండేల్ చంద్ర శేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాయలసీమ

శ్రీ అచ్యుతరామ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి

శ్రీ పవన్ ప్రభాకర్ శర్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం రావడం జరిగింది.బ్రహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులంత కలిసి ఐక్యంగా విజయ పథంలోకి తీసుకోని వెళుతున్న బ్రహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు ఇదే మా అభినందన మందారాలు అని తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ పెందుర్తి తరపు నుండి ఉత్తమ సోషల్ వర్క్ అవార్డు మరియు ఉత్తమ జ్యోతిష్య జాతక వాస్తు పండిట్ అవార్డులను కైవసం చేసుకున్న మన వైజాగ్ బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మ. చదువుకోవాలని ఉన్న ఆర్ధిక స్తోమత లేని, బ్రహ్మణ పిల్లలకి గురువు అయి స్కాలర్షిప్ ద్వారా చదువుకి సహాయం చేస్తున్నారు. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలేని స్థితిలో ఉన్న వారికి తాళిబొట్టుతో సహాయం యిచ్చి తల్లి తండ్రి అయి అండగ నిలుస్తున్నారు. బ్రాహ్మణులకు ఇండ్లు పథకాలు పెట్టె ఒక స్నేహితుడి లాగా నేనున్నాను అనే ఒక భరోసాని కల్పిస్తూ కుటీర పరిశ్రమలు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు సాగుతున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక లో తనదైన ముద్రను వేసుకొని మునుముందుకు వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. బ్రాహ్మణులు క్రీడల మరియు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఎన్నో విలుత్వ కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వీధిలో రాజేష్ కుమార్ శర్మ. ఇంత గుర్తింపుకు కారణమైన తన కుటుంబ సభ్యులని తెలియజేయడం జరిగింది .అదే కాక తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలనని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వైజాగ్ లో ఉత్తరాంధ్ర పురోహిత మిత్రుని స్థాపించడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు వైజాగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాదని తెలియజేయడం జరిగింది.

..........
8
863 views    0 comment
0 Shares

8
787 views    0 comment
1 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

AIMA
వరలక్ష్మీనగర్,
వేపగుంట,
విశాఖపట్నం-47
దేవాలయ

శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి

జై శ్రీమన్నారాయణ

07-08-2023 గురువారం నాడు ఉ 07 గం నుండి మ॥ 12 గం వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి ఈ సందర్భంగా శ్రీరంగనాథ మూల విరాట్ కి గ్రీన్ పార్క్ వద్ద షిరిడి సాయి మందిర్ చారిటబుల్ ట్రస్టు రి.నెం. 13/2002, సద్గురు హిల్స్, వరలక్ష్మీనగర్, వేపగుంట, విశాఖపట్నం-47 దేవాలయ ప్రధాన అర్చకుడు మిరియాల సంతోష్ కుమార్ శర్మ
స్వామిచే దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ అద్భుత విశేష అర్చనలు మరియు అభిషేక కార్యక్రమాలు అలంకారం.
ఉంటుంది..

అంగరంగ వైభవంగా జరిగే కృష్ణాష్టమి వేడుకలకు భగవద్బందువులందరూ విచ్చేసి, స్వామికి నివేదించిన విశేషప్రసాదములను స్వీకరించాలని విన్నపం.

ఇట్లు
దేవాలయ అర్చకులు
మరియు
దేవాలయ కమిటీ సభ్యులు

..........
14
727 views    0 comment
0 Shares

37
369 views    0 comment
0 Shares

AIMA
వైజాగ్ న్యూస్

చంద్రయాన్3 వైజాగ్ బ్రాహ్మణ పిల్లవాడు భరద్వాజ్ శాస్త్రవేత్త గా పాల్గొనడం జరిగింది.

బ్రాహ్మణ సంఘాలు మరియు బ్రాహ్మణ కమ్యూనిటీ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర తరపు నుండి ప్రెసిడెంట్ గారు ఇన్చార్జి గారు సెక్రటరీలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వి కే బి ఏపీ త్రిబుల్ ఎస్ తరపు నుండి కూడా శివ గణేష్ శర్మ గారు మరియు విజయ్ గారు కిషోర్ గారు కైలాసపతి గారు ఇతర సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

చంద్రయాన్3 లో వైజాగ్ బ్రాహ్మణ పిల్లవాడు ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం మండలం గవరవరం గ్రామానికి చెందిన కొమ్మనమంచి వెంకట్రావు ప్రముఖ న్యాయవాది కుమారుడు భరద్వాజ్ శాస్త్రవేత్త గా పాల్గొనడం మనందరికీ గర్వకారణం. వైజాగ్ లో ఉన్న సంఘాలు మరియు సంఘ సభ్యులు కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంఘాల కమిటీ మెంబర్లకు ఇన్చార్జిలకు ఆనందానికి అవధులే లేనట్టు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మావాడు చంద్రయాన్3 లో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. మరియు అతి ముఖ్యంగా సీతమ్మ రాజు సుధాకర్ గారు కార్పొరేటర్ కన్నా గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వీకేబి ఏపీ త్రిబుల్ ఎస్ తరఫునుండి'' శివ గణేష్ శర్మ గారు మరియు విజయ్ గారు'' కిరణ్ గారు" శేషాద్రి శర్మ గారు వెంకటేశ్వర్లు గారు కుమార్ శర్మ గారు ఇతర ఇతర సభ్యులతో పాటు వి కే బి ఏ బి త్రిబుల్ ఎస్ మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణమూర్తి శర్మ గారు(రాజేష్ కుమార్ శర్మ ) మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి

..........
199
10775 views    0 comment
1 Shares

AIMA
కొత్తవలస న్యూస్ టుడే

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర బ్రాహ్మణులకు ఉచిత కన్సల్టేషన్ ఇస్తూ వైద్యంలో కూడా రాయితీని కల్పిస్తున్న  సాయి వెంకటేశ్వర హాస్పిటల్ వారు ఈరోజు నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం


HOG సంవత్సరాలకు జీవితాన్ని జోడిస్తుంది
క్యాన్సర్ కేర్‌లో నిపుణుడు

వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య
శిబిరం

సాయి వేంకటేశ్వర హాస్పటల్ పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, విజయనగరం రోడ్, కొత్తవలస

వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య
శిబిరం


నిర్వహించుచున్నాము, ఉచిత వైద్య పరీక్షలు కూడా చేయుచున్నాము ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

తేది24-08-2023 గురువారం ఉ|| గం|| 9:30 లనుండి మ|| గం|| 2:00 వరకు సమయం

స్థలం : పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, కొత్తవలస,

ప్రముఖ వైద్యనిపుణులు

డా॥ పి. వెంకటరాజు గారు (రాజు డాక్టర్), బి.హెచ్.యమ్.ఎస్

ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు

డా॥ గుంటూరు ఇందిర గారు, యం.బి.బి.యస్. డి.యన్.బి (రేడియేషన్ ఆంకాలజి) కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిప్ట్క్యాన్సర్ వ్యాధి లక్షణాలు)

రొమ్ములో గడ్డలు

• పిరియడ్స్ ఆగినవారికి మరల రక్తశ్రావం • మింగుడు పడకపోవడం

• రొమ్ము నుండి నీరు రావడం

• అండాశయం ఓవర్ కి

• సంబంధించిన గడ్డలు పుండ్లు

• ఆకలి లేకపోవడం

తగ్గని కడుపులోని పుండ్లు

ఈ రెండు రొమ్ముల్లో తేడా... 0 థైరాయిడ్ గ్రంధి వాపులు మరియు గడ్డలు

• మగవారికి అంగం మీద పుండ్లు రావడం • గడ్డలు మరియు వాపులు

• గజ్జల్లో బిల్లలు కట్టడం

• నోటిలో పుండ్లు మరియు • గొంతు నొప్పి

పూత• చర్మం మీద పుండ్లు రావడం.

• ఛాతి నొప్పి & ఆగని దగ్గు, తగ్గని అజీర్ణం

ఆ ఆడవారిలో అధిక రక్తస్రావం

• కండల్లో గడ్డలు రావడం దీర్ఘకాలంగా మారిన గొంతు

జీర్ణకోశానికి సంబంధించిన పుండ్లు

• విరోచనంలో రక్తం బంకగా నల్లగా విరోచనం అవ్వడం పడటం

తీవ్రమైన తలనొప్పి మరియు

వాంతులు అవ్వడం.

• బార్య-భర్త కలిసినప్పుడు అవ్వడం

పైన పేర్కొన్న లక్షణాలు కల్గినవారు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు సేవలు వినియోగించుకోగలరు.

సూచన: పాత రిపోర్టులు తీసుకొని రావలెను.

వివరముల కొరకు: 8919365447, 9959976803

హెచ్.సి.జి క్యాన్సర్ సెంటర్, ప్లాట్ నెం 10,11 & 12, ఎ.పి.ఐ.ఐ.సి. హెల్త్ సిటి, పినాకిల్ హాస్సిటల్ కాంపౌండ్, చినగదిలి, ఆరిలోవ, విశాఖపట్నం - 530040

సాయి వేంకటేశ్వర హాస్పటల్ పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, విజయనగరం రోడ్, కొత్తవలస

..........
122
6800 views    0 comment
2 Shares

AIMA
VIZAG
BIG BREAKING NEWS


పురోహిత బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్

సెప్టెంబర్ 16 నుంచి విశాఖ లో ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నీ

విశాఖపట్నం, ఆగస్టు 14, 2023 (AIMA Online):* సెప్టెంబర్ 16, 17 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ప్రెసిడెంట్ గారు ఏలూరు వెంకట రమణ ( రాజేష్ కుమార్ శర్మ) తెలియచేసారు. పోటీల వివరాలను సోమవారం డిఎన్ఎస్ మీడియా కు వివరించారు. నిరంతరం పౌరహిత్యం, వైదిక క్రియలతోను బిజీగా
ఉండే పురోహితులకు కొంత ఉల్లాసం కల్గించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం లోని ఆరిలోవ లో గల మైదానం లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర కు చెందిన ఆరు జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయన్నారు. వీరితో పాటు విశాఖ పట్నం బ్రాహ్మణా పాత్రికీయ సంఘం నుంచి క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారన్నారు. నిర్వాహక కమిటీ లో రాజేష్ కుమార్ శర్మ గారి, టీమ్ మెంబర్స్ అండ్ సెక్రటరీస్ ఇన్ చార్జెస్. సోమయాజులు విజయ్ కుమార్ శర్మ గారి. టీమ్ మెంబర్స్ నెమ్మలూరి శివ గణేష్ శర్మ గారి టీం మెంబెర్స్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పోటీలకు మీడియా పార్టనర్ గా గరుడ టీవీ ఛానల్ మరియు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్. మరియు డి.ఎన్ఎస్ మీడియా ఇతర పాత్రికేయులు వ్యవహరిస్తోందన్నారు. క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 100 మంది కి పైగా పురోహితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పూర్తి స్థాయి క్రికెట్ నిబంధనలతో జరిగే ఈ పోటీల్లో సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రత్యేక ఆకర్షణగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్ల వివరాలు, ఇతర నిబంధనలు త్వరలోనే తెలియజేస్తామని ఆదిత్య చరణ్ మరియు జగదీష్
క్రికెట్ టీం కోఆర్డినేటర్స్
తెలియచేస్తామన్నారు.

..........
183
8709 views    0 comment
0 Shares

166
10421 views    0 comment
1 Shares

ఆల్ ఇండియా మీడియా న్యూస్
కూనవరం

వరదల్లో సాహసోపేతంగా కూనవరం ఎస్సై

సీఎంకు చెప్పిన స్థానికులు

ఎస్సై బి.వెంకటేష్‌ను అభినందించిన సీఎం
మెడల్‌ ఇవ్వాలని సిఫార్సు.

కూనవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా
గత ఏడాది, ఈఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించిన కూనవరం ఎస్సైను ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సోమవారం అభినందించారు. హెలిపాడ్‌ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపనకోసం సీఎం బస్సుదిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికుల అధికారులు బాగా పనిచేశారని సీఎంకు చెప్పారు. అదే సమయంలో స్థానిక ఎస్సై వెంకటేష్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సాహసోపేతంగా నిర్వహించారని గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని సీఎం ఎదుట మెచ్చుకున్నారు.

అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌ను సీఎం భుజం తట్టి, అభినందించారు. మెడల్‌ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు.

..........
50
1780 views    0 comment
0 Shares

AIMA
VIZAG
సింహాచలం


*టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం భక్తుల్ని అవమానించడమే...!!*

పుడిపేద్ది శర్మ.
విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్రా టోలి కన్వీనర్
టిటిడి చైర్మన్ గా నియమించిన కరుణాకర్ రెడ్డి హిందువు కాదని, అతని పేరులోనే అన్యమతo పేరుతో ఉండటం జరిగింది. ఒక అన్యమతస్తుడిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా ఎలా నియమిస్తారని గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇతన్నే నియమించి ఇదే తప్పుడు విధానాన్ని అవలంబించి ఆనాడు టీటీడీలో అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా తీసుకోవడం జరిగిందని ఆనాటి ప్రభావమే నేడు తిరుమల కొండల్లో అన్యమత ప్రచారం యదేచ్చగా జరుగుతుందని దానికి మూల కారణం ఆనాటి నేటి కరుణాకర్ రెడ్డి అని అతన్ని మరల వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎలా చైర్మన్గా నియమిస్తారని అతను మరలా టీటీడీ ఏడు కొండల్ని రెండు కొండలుగా మార్చే విధానం చేపడుతాడని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని టిటిడి చైర్మన్ గా గతంలో ఒక అన్యమతస్తుడిని రెడ్డి ని నియమించారని మరలా ఇప్పుడు రెడ్డి నే నియమిస్తున్నారని రెడ్డిల సామాజిక వర్గం తప్పితే హిందువుల్లో ఏ సామాజిక వర్గం టిటిడి చైర్మన్ గా వైయస్ జగన్ ప్రభుత్వంలో పనికిరారా అని. గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పింక్ డైమండ్ మాయమైందని ఆనాడు తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఇప్పటి ప్రతిపక్ష నేతపై అబద్ధాలు ప్రచారం చేశారని మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తారని. పింక్ డైమండ్ గురించి జగన్ ప్రభుత్వం నేటివరకు ఎందుకు నోరు మెదప లేదని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అన్యమతస్తుల్ని కాకుండా హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులని చైర్మన్గా నియమించాలని విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్రా టోలి కన్వీనర్ పుడిపేద్ది శర్మ డిమాండ్ చేశారు.

పూడిపెద్ది శర్మ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షతన విజయ శంకర్ ఫణీంద్ర,మాధవి లత,నాగభూషణం,చంద్రశేఖర్,విజయ్ కుమార్ శర్మ,రామకృష్ణ,అప్పలనాయుడు,అజయ్ యాదవ్ మొదలగు వారు బీజేపీ,విశ్వహిందూ పరిషత్,దార్మిక సెల్ నుండి పాల్గొనగా

తేదీ ఆగస్ట్ 7, 2023 సోమవారం ఉదయం 10:30 గంటలకు తొలి పావంచ,సింహాచల పుణ్యక్షేత్రం,విశాఖపట్నం వద్ద
Haryana లోనూ, మణిపూర్ లోనూ హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలకు నిరసిస్తు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినారు
పూడిపెద్ది శర్మగారుమాటలలో
ఉత్తర భారతదేశం నందు గల హర్యానా రాష్ట్రంలో నుహు జిల్లాలో విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దల్ గో రక్షక్ లు పాల్గొని శాంతియుతంగా శోభాయాత్ర చేయుచుండగ వారిపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారు ఇది దుర్మార్గమైన చర్య ప్రభుత్వం చొరవ తీసుకొని దాడి చేసిన వారిని దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయమని విశ్వ హిందూ పరిషత్ కోరుచున్నది అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రంలో మైతీ,కుక్కి,నాగ మొదలగు గిరిజన తెగలు నివసిస్తుంటాయి ఆయా తెగల మధ్య ఎన్నో సంవత్సరాల నుండి ఆదిపత్య పోరు జరుగుతున్నది అది ప్రస్తుతం కుకీ మరియు మైతి తెగల మధ్య మారణకాండగా మారినది అసలు విషయాలు పక్కన పెట్టి క్రిస్టియన్ గ్రూపుల వారు అదేదో క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులు అన్నట్టు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అసలు గిరిజనులైన వారిని క్రిస్టియన్లుగా మార్చింది ఎవరు ఈ క్రిస్టియన్ గ్రూప్స్ వారు అవాస్తవాలను ప్రచారం చేయడం వలన దేశ సార్వభౌమత్వం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు దీనిని విశ్వహిందూ పరిషత్ ఖండిస్తుంది
*పూడి పెద్ది శర్మ*
*విశ్వ హిందూ పరిషత్*
*రాష్ట్ర శాఖ మఠ్ మందిర్ టోలి*షత్

..........
81
130 views    0 comment
1 Shares

AIMA
BREAKING NEWS


ఆంధ్రప్రదేశ్ పురోహిత అర్చక సంఘం అధ్యక్షులుగా నేను ఉన్నాను. గత కొన్ని రోజులుగా ప్రస్తుత కార్యదర్శి అనేక విధాలుగా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అందులో భాగంగా మన సంఘం ఏర్పాటు చేయకముందు వేరే సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను. సంఘము పెట్టిన మని తెలిసి వారు ఆ సంఘంలో నన్ను తొలగించారు. ఇది జరిగి ఆరు నెలలు అయింది. మ సంఘం ఏర్పాటు చేసి ఆరు నెలలు అయింది ‌ నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రస్తుత కార్యదర్శి గారు ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఉదయమే చెప్పాను పదిమందికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానని కానీ ప్రధాన కార్యదర్శి గారు ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారని చెప్పాను ఎప్పుడో జరిగిన ఘటనను కారణం చూపుతూ అనేక విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ..ఇంకా అనేక ఫోటోలు వీడియోలు కూడా పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు . నా మీద లేనిపోని ఆరోపణలు చేసి చిత్రీకరించి తన తప్పుల్ని దాచి.ప్రస్తుత కార్యదర్శి గారు ఎలాగైనా నా అడ్రస్ మీద ఉన్న సంఘాన్ని లాక్కుని పదవులు అనుభవించాలని చూస్తున్నారు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ పురోహిత అర్చక సంఘమును ఆయన బలవంతంగా నా దగ్గర నుంచి లాక్కోవాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ప్రస్తుత కార్యదర్శి దయచేసి సభ్యులందరూ అర్థం చేసుకుని ఒక వ్యక్తి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎలా ఇబ్బంది పెడతారు అనేది కూడా గమనించమని ఈ గ్రూపులో ఉన్న సభ్యులు చాలామంది కొత్తగా ఏర్పడిన గ్రూపులో ఉన్నారు కనుక అందరికీ జరిగిన విషయాలు తెలియాలని నేను మెసేజ్ పెట్టడం జరిగింది
సమాజం కోసం బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సంఘం ఏర్పాటు చేయడం జరిగింది కానీ వ్యక్తులు వాళ్ల స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిదా కాదా అనేది సభ్యులందరూ ఆలోచించమని ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంచి చేయకుండా రేపు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కనుక అందరూ ఆలోచించమని కోరుతున్నాం.అధ్యక్షులు
రాళ్లపల్లి నాగ వెంకట రవికుమార్ కుమార్ శాస్త్రి గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది

..........
133
1814 views    0 comment
2 Shares

ఆల్ ఇండియా మీడియా
బ్రేకింగ్ న్యూస్


ప్రమాణ స్వీకార రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ వెల్లాల మధుసూధన శర్మ తేది: 23-7-2023 ఆదివారము

ఆహ్వానించువారు

కర్నూలు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం
కర్నూలు జిల్లా.


news
ప్రమాణ స్వీకార ఆహ్వాన
తేది: 23-7-2023 ఆదివారము ఉదయం 11:00 గం॥లకు ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ వెల్లాల మధుసూధన శర్మ గారు ప్రమాణ స్వీకరం చేయుచున్న శుభ సందర్భంగా బ్రాహ్మణ బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషులు.తప్పక హాజరు కావలసినదిగా మనస్పూర్తిగా కోరుచున్నాను.

వేదిక: దేవీ ఫంక్షన్ హాల్,
నంద్యాల చెక్ పోస్ట్ కర్నూలు

ఆహ్వానించువారు
కర్నూలు జిల్లా
బ్రాహ్మణ సేవా సంఘం
కర్నూలు జిల్లా
సెల్: 9885502082

..........
47
4428 views    0 comment
0 Shares

విశాఖపట్నం,
జులై 11, 2023
ఆల్ ఇండియా మీడియా న్యూస్


ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ శర్మ. పేరి సుబ్రహ్మణ్య శర్మ మరియు కార్యవర్గ సభ్యురాలైన నాగమణి గారు కమిటీ ఏరియా ఇంచార్జ్ శేషాద్రి శర్మ గారు మిగిలిన సభ్యులు రాపర్తి కన్నా గారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లడం జరిగింది బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ ని సోమవారం ప్రకటించిన సందర్భంగా కమిటీ లో విశాఖపట్ణము లోని పెందుర్తి కి చెందిన రాపర్తి కన్నాకు స్థానం కల్పించినందుకుగాను శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణా సామజిక వర్గం ప్రతినిధుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ ని సోమవారం ప్రకటించింది. ఈ కమిటీ లో విశాఖపట్ణము లోని పెందుర్తి కి చెందిన రాపర్తి కన్నాకు స్థానం కల్పించారు. ఈయన ప్రస్తుతం విశాఖ మహా నగరం మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కమిటీ కన్వీనర్ గా బుచ్చి రాంప్రసాద్ నియమించారు. వివిధ కమిటీ ఎంపిక ను జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సమక్షం లో ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య ) తదితరులు పరిశీలించారు.

జిల్లాలకు చెందిన సభ్యులు వీరే:

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలాస నియోజకవర్గం : ధర్మపురి అనిల్ శర్మ

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పెందుర్తి నియోజకవర్గం : రాపాక త్రివేణి వర ప్రసాద్

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి నగరం నియోజకవర్గం :మువ్వా వీర వెంకట సత్యనారాయణ

విజయవాడ పార్లమెంట్ పరిధిలో నందిగామ నియోజకవర్గం : ఈమని సూర్యనారాయణ

విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ నియోజకవర్గం : గార్లపాటి విజయ్ కుమార్

గుంటూరు పార్లమెంట్పరిధిలో గుంటూరు నియోజకవర్గం : చింతపల్లి వెంకట రమణ రావు

నరసారావు పేట పార్లమెంట్ పరిధిలో పలాస నియోజకవర్గం:గూడూరు శేఖర్ శ్రీరామ మూర్తి

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు నియోజకవర్గం : శ్రీరామమూర్తి టివి

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరు రురల్ నియోజకవర్గం : తడకపల్లి సుధా రవీద్ర

తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి నియోజకవర్గం : చిత్రపు హనుమంత రావు


కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు నియోజకవర్గం : సముద్రాల హనుమంత రావు

..........
75
4281 views    0 comment
0 Shares

AIMA
VIZAG NEWS


BIG BRAKING NEWS


ఈ ఒక్క రోజే అతిపెద్ద పగటి రోజు

13 గంటల 7 నిమిషాల పాటు పగలు
గుడివాడలో తొలి సూర్యోదయం
నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.

ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ
ఈ నెల 21వ తేదీ మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.

ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.


పురోహిత అర్చకులు కోసం అనేక కార్యక్రమాల్ని ఈ కింద నిచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే అన్ని అందుబాటులో ఉంటాయి.https://youtube.com/@GTCN143


మీ ప్రకటనలు కూడా ఉచితంగా వేయబడటం జరుగుతుంది మమ్మల్ని కన్సల్ట్ చేయవలసిన నెంబరు 9618688312.9010243952

..........
58
3085 views    0 comment
1 Shares

AIMA
VIZAG
BIG BAKING NEWS


ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్న పురోహితులందరికీ సువర్ణ అవకాశం మరియు మంచి అవకాశం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

మేము ఇచ్చే కోడిని పరీక్షా సెంటర్లో గానీ పరీక్ష ఫారం లో గాని ఎంట్రీ చేస్తే మంచి ప్రాధాన్యత కలుగును.( రిఫరెన్స్ బై) అని రాసి ఈ కోడిని రాయండి.(( VIZAG UPM O1 ))


ఈ పరీక్షలకు ప్రత్యేకంగా హాజరయ్యే వాళ్ళు ప్రధమ ద్వితీయ తృతీయ చతుర్ధ భాగాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతాయి పురోహితులు మరియు అర్చకులు కూడా రావచ్చును.

బ్రాహ్మణ పురోహీతులకు వెంటనే షేర్ చెయ్యండి. అన్ని బ్రాహ్మణ గ్రూపులకు పంపించండి.

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారి నిర్వాహణ లో, చిత్తూరు జిల్లా వారి సారథ్యంలో తిరుపతి మహా పుణ్యక్షేత్రం లో జులై 25,26 వ తేదీలలో పురోహిత/స్మార్త పరీక్షలు నిర్వహింపబడును. ఈ పరీక్షలో పాల్గొన్న బ్రాహ్మణ పురోహీతులకు వారి వారి సూత్రానుసారంగా పరీక్ష నిర్వహించి, వారి సామర్ధ్యం అనుసరించి గొప్ప పట్టా ప్రదానోత్సవం చేయబడును. పట్టాతో పాటుగా వారికి బిరుదము కూడా ప్రదానము చేయబడును. కావున ఈ సదావకాశం అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ పరీక్షలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు బ్రాహ్మణ పురోహితులు ఇవ్వవచ్చును. పరీక్ష విధానం మౌఖిక పరీక్ష మాత్రమే. పరీక్ష ఇవ్వగోరు అభ్యర్థులు వెనువెంటనే ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. పరీక్షకు ఎటువంటి ఫీస్ లేదా రుసుము లేదు.

http://appurohitabrahmanasamakhya.com/en/form/apply-exam


పరీక్షకు వెళ్లే పురోహితులు ఈ యాడ్ ద్వారా ఇచ్చే కోడిని పరీక్షా సెంటర్లో పరీక్షా హాల్లో తెలియజేసినచో వాళ్లకి ప్రధమ ప్రాధాన్యత కలుగును. VIZAG UPM O1

..........
128
9382 views    0 comment
1 Shares

AIMA
విశాఖపట్నం
జూన్ 19


బాలికపై అత్యాచారం కేసులో.
పూర్ణానంద సరస్వతి అరెస్ట్.
కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు
ఆధ్యాత్మిక వర్గాల్లో కలకలం


వెంకోజి పాలెంలో జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీని సోమవారం ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో స్వామీజీ వేధింపులకు పాల్పడడమే కాకుండా, బాలికపై LEADER అత్యాచారం చేసినట్టు అమరావతిలోని దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్ణానంద సరస్వతి స్వామీజీని అరెస్ట్ చేయడం ఆధ్యాత్మిక వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధగా మారిన 12 ఏళ్ల బాలికను, విజయవాడకు చెందిన ఆమె పెద్దమ్మ నగరంలోని వెంకోజి పాలెంలో గల జ్ఞానానంద ఆశ్రమంలో చేర్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకుడైన పూర్ణానంద సరస్వతి స్వామీజీ కళ్ళు బాలికపై పడ్డాయి. బాలికను గొలుసులతో స్వామీజీ బంధించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు చెస్తోంది. ఈ తరుణంలో బాలిక అతని చెంత నుండి తప్పించుకొని విజయవాడలోని పెద్దమ్మ వద్దకు చేరుకొని, జరిగిన విషయం చెప్పడంతో, పెద్దమ్మ సహాయంతో బాలిక అక్కడి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామీజీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించగా, అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో విజయవాడలోని దిశా పోలీసులు కేసును ఎంవీపీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామీజీని అదుపులోకి తీసుకున్నట్టు ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. అయితే స్వామీజీ ఆశ్రమం ఈనెల 13 నుండి బాలిక కనిపించడం లేదని పూర్ణానంద సరస్వతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం గమనార్హం.తనకే పాపం తెలియదు, కుట్ర చేసి ఇరికించారు- స్వామీజీ..

ఇదిలా ఉండగా ఆశ్రమ భూములను కాజేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే ఈ కుట్ర జరిగిందని పోలీసుల అదుపులో ఉన్న స్వామీజీ చెప్తున్నారు. దీనిపై తాను కోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సింహాచల దేవస్థానం తప్పు చేస్తోందని, దేవస్థానం భూములు కబ్జాకు గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరని, కాని తన పైన ఆశ్రమంపైన కక్ష కట్టి ఇలా చేస్తున్నారని చెప్పారు. ఒక్కప్పుడు ఆశ్రమంలో 1500మంది పిల్లలు ఉండే వారని, ఇప్పుడు 12 మంది మాత్రమే ఉంటున్నారన్నారు.

ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నారని, ఫిర్యాదురాలిని మచ్చిక చేసుకుని తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని, తగిన న్యాయ పోరాటం చేస్తానని స్వామీజీ వివరణ ఇచ్చారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఎంవీపీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

..........
81
7524 views    0 comment
0 Shares

AIMA
DEVOTIONAL NEWS
VIZAG

ఆషాఢ మాసం యొక్క ప్రాముక్యత ఏమిటి...?

ఆషాఢ మాసము

ఈ శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ మాసారంభము. ఈ సమయము నందు లగ్నము కర్కాటక లగ్నమునకు శుక్ర, కుజ లగ్నమునందు అష్టమమున శని వ్యయమున సూర్యుడు, చంద్రుడు కలయికచే అనావృష్టి యోగము కన్పడుచున్నది. వాతావరణము కలుషితమై ప్రజలకు అనారోగ్యములను కలుగజేయును. అష్టనుమున శని దశమ కేంద్రమున రాహువు, గురుడు, లగ్నమందు పూర్ణ జలరాశి సంచారముచే అతివృష్టి, అనావృష్టి మొదలగు ప్రకృతి వైపరీత్యములను, తుఫాను వాయుగుండం ద్వారా. కలుగజేయుటకు యతింతురు. షష్టమమందు కేతువు తోక చుక్కలు మొదలగు ఉత్పాతములను కలుగజేయును. దుర్యోగము గురుడు దశమ మందుండుటచే తప్పిపోవుటకు దోహదపడును. ఈ మాసమున రవి కర్కాటక రాశి యందు ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నము ధనుస్సు లగ్నమునకు తృతీయమున శని పంచమమున గురువు, రాహువు, భాగ్యమున శుక్రుడు, కుజుడు, బుధుడు అష్టమ స్థానమున సంయోగముచే పూర్ణజలరాశి యందు వర్షము అధికముగా యుండును.

ఈ మాసం నందున వర్షము అధికముగా నుండును. ఈ మాసము నందు శుక్రుడు కుజుడు కర్కాటక రాశి యందు సంచారమున వర్షాభావము అధికముగా కన్పడుచున్నది.

ఆరుద్ర కార్తె :
22-6-2023న రా॥ 2-10 ని॥లకు సూర్యుడు ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నము మేష లగ్నము. లగ్న తృతీయమందు శని చతుర్థమందు, గురుడు, దశమ కేంద్రమునందు | శుక్రుడు భాగ్యస్థానాధిపతి గురుడు లగ్నమందు వీక్షించుటచే, వాతావరణము నందు కొన్ని మార్పులు కన్పడుచున్నవి. వాతావరణం అనుకూలముగా ఉండక పోవచ్చును. ప్రకృతి వైపరీత్యములకు దోహదపడును.

శుక్రుడు
జూలై 5 వరకు కర్కాటక రాశి యందు సంచారమున పూర్ణ జలరాశి సంచారముచే శని కుంభరాశి యందు | సంచారముచే వాయు సహిత వృష్టులు అధికముగా వుండుటకు | దోహదపడును. వీదురు గాలులు వీచును. వర్ష లక్షణముండును. వాయు చలనములో మార్పులు సాయంకాలమునకు వాతావరణంలో మార్పులు రాత్రి అయస్కాంత శక్తి పెరుగుట ఖండవృష్టి మరియు లక్షములుండును. శుక్రుడు సింహరాశి ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నం సింహం, కుజ, సూర్యుడు/ వ్యయమున సప్తమమున గురుడు షష్టమ కోణమునందు శని లాభ | స్థానమున బుధుడు వాయు సహిత వృష్టులు కలుగజేయును. లగ్నమునకు గురుని యొక్క దృష్టి విశేష వర్షమునకు దారి చూపును. అక్కడక్కడా భారతదేశమందు జల ప్రళయము జన నష్టము కలుగు ప్రమాదము లేకపోలేదు. షష్టస్థానమున శని యోగము వలన కొన్ని | ప్రకృతి వైపరీత్యములు సంభవించును. తుఫాను వర్షములు కూడా | కలుగుటకు యత్నము కలుగజేయును. కొన్నిచోట్ల అతివృష్టి.. కొన్ని రాష్ట్రములకు అనావృష్టి కలుగజేయును. శని పూర్ణజలరాశి యందు సంచారముచే వాయు చలనము విస్తారముగా నుండుటకు "మేఘవాతనపీడితా" అను సూత్ర క్రమంబున మేఘములు గాలిలో చెదరగొట్టబడి వాయు సహిత ఖండవృష్టులకు దోహదపడును. తుఫాను లక్షణములు కలుగును.

బుధుడు :
మిథునరాశి యందు బుధుడు జూలై 7 వరకు ఉండుటచే పాద జలరాశి -స్వస్థానమందుండుటచే అతివృష్టి అవకాశము కలుగును. పశువులకు అనుకూలవృష్టి ముఖ్యముగా ఉత్తరాంధ్ర రైతులలో ఆనందం కలుగును. కొన్ని అతివృష్టి, అనావృష్టి యోగములున్నను సాముదాయకముగా, ఈ యొక్క బుధుడు మిథునరాశి యందు సంచారమున అనుకూల పరిస్థితులు కన్పడుచున్నవి. బుధుడు కర్కాటకరాశి లోకి ప్రవేశించును. ఈ సమయము నందు కన్యాలగ్నం - నిర్జలరాశి సంచారము - వాతావరణం అనుకూలముగా నుండి, సస్యానుకూల వృష్టి కలిగి, పశుగ్రాసము అధికముగా లభించుటచే గోవులు పాలను ఇచ్చును. రవి, బుధుల సంయోగము ఉష్ణోగ్రత తగ్గుటకు ప్రజారంజకముగా ఉండుటకు దోహదపడును. వర్షపాతమధికముగా ఉండును. ఉత్తర భారతమున కొన్ని నదులు పొంగి పొరలి ప్రవహించును. జూలై ఆకరిన వర్షపాతము, తుఫాను హెచ్చరికలు, వాతావరణంలో పూర్తి మార్పులు కనబడుచున్నవి.

ఈ మాసమున సూర్యుడు మృగశిర కార్తె యందు ప్రవేశించునప్పుడు జలనాడి సంచారములో ఉన్నందున గాలిలో తేమ వర్షయోగము సూచించును. ఈ ప్రభావము వలన శుక్ల పక్షమున ఉత్తరాంధ్రయందు సస్యానుకూల వృష్టి కలిగి రైతులు ఆహ్లాదకరంగా ఉందురు. పశుగ్రాస కొరత తీరును. చెరువులు, కుంటలు, జల సమృద్ధి కలిగి యుండును. దక్షిణాది జిల్లాలలో కృష్ణపక్షము నుండి ఋతుపవన ప్రభావము అధికముగా ఉండును. సస్యానుకూల వృష్టి కలిగి వరినాట్లు కొన్ని ప్రాంతముల యందు ప్రారంభించుటకు అనుకూల పరిస్థితులు ఏర్పడును. ఆకాశము మేఘావృతమై చల్లని వాతావరణం, ఋతుధర్మము కలిగి ఉండును.

శ్లో॥ యది విధి దిష్ట్యం పతతి తటాకం
శుభ జల వృష్టిర్థన కణ వృద్ధి॥

సముద్ర తటాకమందు సముద్రపు ఒడ్డున రోహిణి వాసమై యున్న మాసమున సువృష్టి యుండును. సస్యవృద్ధి తృణ వృద్ధి ధన వృద్ధి యుండును. పాడిపంటలు సమృద్ధిగా యుండుటచే ధరలు సరసముగా వుండును.

..........
32
2421 views    0 comment
1 Shares

AIMA
విజయనగరం డివోషనల్ న్యూస్

వెంకటేశ్వర స్వామి దేవాలయం, గరివిడి,
విజయనగరం జిల్లా
దేవాలయాల ప్రతిష్ట

శ్రీశ్రీశ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి నాగబంధ, శ్రీ నందీశ్వర విగ్రహ ప్రతిష్టాపన

తే 05-06-2023 ది సోమవారం రోజున జరగబోతున్న కార్యక్రమాలు.


ఉదయం గం॥ 7-00 ని॥ల నుండి
లక్ష్మీగణపతి హోమాలు, రత్నన్యాసం,
ఉదయం గం॥ 7-52 ని॥ల నుండి

విగ్రహప్రతిష్ఠ, జీవ కళాన్యాసము, కళాహోమాలు, మహాపూర్ణాహుతి,
ధేనుదర్పణదర్శనములు, సర్వదర్శనం
ఉదయం గం॥ 10-30 ని॥ల నుండి
శ్రీ శివపార్వతుల కళ్యాణం
మధ్యాహ్నం గం॥ 12-30 ని॥ల నుండి
తీర్ధప్రసాద స్వీకారం, పండిత సన్మానం, వేద మహదాశ్వీరచనం.

బ్రహ్మశ్రీ కప్పగంతుల ప్రసాద్ శర్మ త్రివేద పండితులు. రాంబట్ల సుబ్బారావు గారు పవన్ కుమార్ శర్మ గారు రాజా విశ్వనాథ బుర్ర శర్మగారు మంతా సుబ్రహ్మణ్య శర్మ గారు చైతన్య చార్యులు కప్పగంతుల శ్రీనివాస్ శర్మ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది మరియు ఆలయ కమిటీ వారి
ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు
నిర్వహించబడును.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయధర్మ కర్తలు మరియు పురజనులు గరివిడి, విజయనగరం జిల్లా,

..........
69
8563 views    0 comment
0 Shares