logo

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రాంతీయ ఇన్చార్జిల నియామకం AIMA, (హైదరాబాద్/విశాఖపట్నం): పురోహిత మిత్ర ఉత్తరాంధ్ర గ్రూప్ ఆధ్వ

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రాంతీయ ఇన్చార్జిల నియామకం

AIMA, (హైదరాబాద్/విశాఖపట్నం): పురోహిత మిత్ర ఉత్తరాంధ్ర గ్రూప్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రాంతీయ ఇన్ చార్జీలను నియమించారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ అధ్యక్షుడు ఏలూరు వెంకటరమణ మూర్తి శర్మ(రాజేష్ కుమార్ శర్మ)కు ప్రోత్సాహం అందించి సహాయపడిన వారిని ప్రాంతాల వారీగా ఇన్చార్జీలుగా నియమించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఈసారి శ్రీకాకుళం, విజయనగరం నుంచి పెంటా అశోక్ శర్మ, సంబర శ్రీరామ సూర్యప్రకాశ్ శర్మలను ఇన్చార్జిలుగా నియమించినట్టు ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా విశాఖ జిల్లాలో తొమ్మిది మందిని ఇన్ చార్జిగా నియమించినట్టు చెప్పారు. పి.లక్ష్మి ఉదయ, భాగవతుల లక్ష్మణ్ కుమార్, డి.వెంకటేశ్వర్లు, కొలచల వెంకటలక్ష్మి ప్రశాంతి, ఈ. సంతోషిణి, నూకల రమేష్, వి.స్పందన, భాస్కరభట్ల రవికుమార్, వాడ్రేవు ధనరాజ్ లు ఇన్చార్జి లుగా నియమితులయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక నియమక పత్రాలను హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో అందజేశారు.

మరిన్ని వార్తల విశ్లేషణ కోసం https://youtube.com/@elururajesh143 ను వీక్షించండి

23
14698 views
  
1 shares