భారీగా పట్టుబడ్డ గంజాయి.
విజయనగరం జిల్లా, పాచిపెంట మండలం, కోడి కాళ్ళ వలస గ్రామం వద్ద పోలీసులు జూలై 22 గురువారం నాడు వాహన తనిఖీలు చేపట్టి న సమయంలో, వాహనంలో తరలిస్తున్న 561 కిలోల గంజాయి, ఇద్దరు వ్యక్తులను, అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక బైక్, వ్యాను, రెండు సెల్ ఫోన్లను సాలూరు సిఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.