logo

ఆగ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పై సస్పెన్షన్వేటు


విజయనగరం: జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ
ఫీల్డ్ అసిస్టెంట్ దోర అప్పల నాయుడును జిల్లా నీటి
యాజమాన్య సంస్థ (
డ్వామా) పీడీ జి.ఉమా పరమేశ్వరి
బుధవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను
అప్పల నాయుడుకు పంపించారు. ఫీల్డ్ అసిస్టెంట్
పలువురు పనులకు రాకున్నా రికార్డుల్లో నమోదు
చేసినట్టు నిర్ధారించారు. వారి పేరిట నిధులు కూడా
డ్రా చేసినట్టు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశామని
ఉత్తర్వుల్లో తెలిపారు.

0
14669 views