ఘనంగా శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
పాణ్యం (AIMA MEDIA): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్)లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ పులివెందుల ప్రిన్సిపాల్ డా. విష్ణు వర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం కార్యక్రమానికి అధ్యక్షత వహించి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకం మరియు ప్రకృతి సంరక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి డా. విష్ణు గారు మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రపంచానికి సవాలుగా మారిన నేపథ్యంలో ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల హెచ్ఓడీలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO), అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు.