రైతుల నుంచి రాగుల కొనుగోలు ప్రారంభం
పెనుకొండ, జూన్ 5: పెనుకొండ మార్కెట్ యార్డులో ఇస్లాపురం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల నుంచి రాగుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. మంత్రి సవిత సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు పోతిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య, శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఈశ్వర్ ప్రసాద్, బుక్సంపల్లి రామకృష్ణప్ప, నాగులూరు నారాయణస్వామి, మాజీ సర్పంచులు సూర్యనారాయణ, సోమశేఖర్, గోపాల్, సిద్ధయ్య, లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, బాబుల్ రెడ్డి, జయరాములు, రమణమ్మ, త్రివేంద్ర, ఆదిశేషు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010