ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేయాలి: మోదీ
న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలో ఇళ్లలో, ఆలయాల్లో నిల్వగా ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని Narendra Modi పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 30 వేల నుంచి 32 వేల టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా ఉందన్నారు.
నిపుణుల అంచనా ప్రకారం మొత్తం నిల్వల్లో కేవలం 1% బంగారాన్ని రీసైకిల్ చేసినా దిగుమతులు దాదాపు 30% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రధాని పిలుపును జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.
🟦 దేశంలో 32 వేల టన్నుల బంగారం నిల్వలు 🟦 1% రీసైక్లింగ్తో 30% దిగుమతుల తగ్గుదల సాధ్యం 🟦 విదేశీ మారక నిల్వల పరిరక్షణే ప్రధాన లక్ష్యం 🟦 మోదీ పిలుపుకు జ్యువెలరీ రంగం మద్దతు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010
,