క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
శ్రీ సత్యసాయి ( AIMA MEDIA ) : సత్యసాయి జిల్లా లో నక్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా చేసుకుని ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని పోలీసులు యువతకు సూచించారు.