న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి Arjun Ram Meghwal గోవధ నిషేధంపై స్పష్టం
న్యూఢిల్లీ (AIMA MEDIA ): దేశంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం లేదా దేశవ్యాప్తంగా గోవధ నిషేధం అమలు చేయడం వంటి ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి Arjun Ram Meghwal స్పష్టం చేశారు.
ఈ అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల నుంచి వినతులు అందుతున్నప్పటికీ కేంద్ర కేబినెట్ ముందు ఎలాంటి ప్రతిపాదనలేదని ఆయన తెలిపారు. గోవధకు సంబంధించిన చట్టాలు రాష్ట్రాల పరిస్థితులు, స్థానిక అవసరాలను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గోవధ చట్టాలపై కొనసాగుతున్న చర్చలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010
,