పాతపట్నం నియోజకవర్గం పరిధిలో "మహానాడు" కార్యక్రమంలో సుమారు 8000 మంది పైగా కార్యకర్తలు పాల్గొనడం ఎంతో ఆనందం...ఎమ్మెల్యే ఎంజీఆర్
పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో 12 క్లస్టర్లలో నిర్వహించిన వర్చువల్ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
మహానాడు కార్యక్రమాలకు హాజరైన సుమారు 8,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా భోజనాలు, త్రాగునీటి సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం మొత్తం దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కార్యకర్తలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాము.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కష్టపడే ప్రతి కార్యకర్త మా కుటుంబ సభ్యుడే. పార్టీ శ్రేణుల సేవలో ఎల్లప్పుడూ ముందుండి, వారి అభిమానం – విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మరింత కృషి చేస్తాము.
ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
#HybridMahanadu2026
#MamidiGovindaRao
#TeluguDesamParty
#Pathapatnam
#TDPFamily