ఎవరెస్ట్ను జయించిన అరుణ్ తివారి హిమాలయాల్లో మరణం
హైదరాబాద్: ప్రముఖ ట్రెక్కర్ మరియు ఐటీ సీనియర్ డైరెక్టర్ అరుణ్ కుమార్ తివారి 2026 మే 21న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అయితే, హిల్లరీ స్టెప్ సమీపంలోని ప్రమాదకరమైన “డెత్ జోన్”లో ఆరోగ్యం బలహీనపడడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షెర్పాలు తన ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అరుణ్ ఎవరెస్ట్ ఒడిలోనే మరణించారు.
అరుణ్ కుమార్ తివారి కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని హిమాలయాల్లోనే వదిలేయాలని నిర్ణయించుకున్నారు. మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా మృతదేహాన్ని తీసుకురావడం చాలా ప్రమాదకరం. అరుణ్ 53 ఏళ్ల వయసులో, ప్రపంచంలోని ప్రధాన పర్వతాలను అధిరోహించి, ఎవరెస్ట్ మీద తన కలను సఫలీకృతం చేసుకున్న వ్యక్తి. ఆయన మరణం ట్రెక్కింగ్ ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.