యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఆమోదం తెలిపిన అస్సాం అసెంబ్లీ
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు దిశగా మరో కీలక అడుగు పడింది. అస్సాం శాసనసభ (Assam Assembly) ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలిపింది
దీంతో దేశంలో ఈ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్, గుజరాత్ల తర్వాత అస్సాం మూడో రాష్ట్రంగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 ప్రకారం.. దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇకపై ఒకే చట్టం వర్తించనుంది. గతంలో ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించగా, ఇప్పుడు అస్సాం కూడా ఆ బాటలోనే పయనిస్తూ దేశంలో చర్చకు తెరలేపింది.