బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్పై మరో దాడి
బలూచిస్తాన్: పాకిస్తాన్లో కేవలం సైనికుల కోసం నడిచే 'జాఫర్ ఎక్స్ప్రెస్' ట్రైన్పై ఆరవసారి సంచలన దాడి జరిగింది. బలూచ్ స్థానికులు పాక్ సైన్యం అకృత్యాలకు ప్రతీకారంగా ఈ దాడిని నిర్వహించారు. 2019లో భారత పుల్వామా దాడి తరహాలో, ఒక పేలుడు నిండిన వాహనం ట్రైన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అనేక పాక్ జవాన్లు మరణించారు.
గత మూడు సంవత్సరాలలో ఈ ట్రైన్పై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ, పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టలేకపోవడం సైనికుల నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ కారణంగా చాలామంది సైనికులు భయంతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.