logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిత్తూరు: అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమం అమలు పై సమావేశం

చిత్తూరు: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మే 26న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యంగా పెట్టబడింది. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, 57,325 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలోని స్వయం సహాయక గ్రూపుల నిరక్షరాస్యులు, డ్వామా ఉపాధి హామీ పనులలో పాల్గొనే నిరక్షరాస్య పురుషులు, పొదుపు సంఘాలకు చెందిన మహిళలు మరియు మెప్మా ఆధ్వర్యంలోని నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యత కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అక్షరాంధ్ర యాప్ ద్వారా అభ్యాసకులు మరియు వాలంటీర్ టీచర్ల మ్యాచింగ్ మరియు బ్యాచింగ్ ప్రక్రియ మే 28న ప్రారంభించి జూన్ 30 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమన్వయం కోసం వివిధ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో శిక్షణ తరగతులు నిర్వహించి జూలై 21 నుంచి అక్షరాంధ్ర తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

12
478 views

Comment