చెరువులో పడిబాలుడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి
మండలం బండపల్లి గ్రామానికి చెందిన మల్యాల సృజన్ 15 సంవత్సరాలు అనే బాలుడు గ్రామంలోని ఊర చెరువులో ఈత నేర్చుకోవడం కోసం వెళ్లగా చెరువులో ఉన్న బురదలో ఇరుక్కొని శ్వాస ఆడకుండా నీటిలో మునిగి మరణించడం జరిగింది సృజన్ మరణంతో బండపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్త తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు