అంకమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి రూరల్ మండలం గుజ్జర్లపూడి గ్రామంలో నిర్వహించిన రేణుక అంకమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.