చాకలి ఐలమ్మ కుటుంబానికి పెద్దపీట
హైదరాబాద్:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కుటుంబీకులకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం.. ఐలమ్మ కుటుంబాన్ని గుర్తించి,
కుటుంబ సభ్యులలో ఒకరికి
మహిళా కమిషన్ సభ్యురాలుగా తీసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి గారికి,ఐలమ్మ కుటుంబ సభ్యుల తరఫున చిట్యాల శ్వేత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..ఈ సందర్భంగాఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ..నా మీద నమ్మకంతో. నాకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎ.రేవంత్ రెడ్డి గారికి,
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి,
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, క్యాబినెట్ మంత్రులకు,
రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి,
ఎంపీ కడియం కావ్య గారికి,స్థానిక పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే
యశస్విని రెడ్డి గారికి , టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి,
జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు లకావత్ ధన్వంతీ లక్ష్మీనారాయణ నాయక్ గారికి,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి.ప్రత్యేక కృతజ్ఞతలు చిట్యాల శ్వేత గారు తెలిపారు..