విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేయడం అధికారికంగా ప్రకటించింది. ఈ రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి కార్యాలాపాలు ప్రారంభించనుంది. ఈ కొత్త జోన్ 18వ రైల్వే జోన్గా గుర్తింపు పొందనుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ వంటి డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సౌత్ సెంట్రల్ మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగాలను పునర్వ్యవస్థీకరించి ఈ కొత్త జోన్ రూపొందించబడింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరియు రైల్వే శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాల్తేరు డివిజన్లో పలాస-ఇచ్చాపురం మార్గాలను చేర్చడం ద్వారా ఉత్తరాంధ్ర రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చంద్రబాబు తెలిపారు. కొత్త జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది అని పేర్కొన్నారు.