తమిళగ వెట్రి కళగం ఎన్నికల్లో అగ్రస్థానంలో, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆగ్రహం
తమిళనాడు: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే వంటి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను వెనక్కి నెట్టి, తమిళగ వెట్రి కళగం (TVK) తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ప్రస్తుతం కాంగ్రెస్కు చెందిన 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినా, టీవీకేకు ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసిన విజయ్ తన వద్ద 112 మంది మద్దతు ఉందని లేఖ సమర్పించారు. కానీ, గవర్నర్ ముందు మెజారిటీ నిరూపించాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు, టీవీకే అధినేత విజయ్ మరియు మంత్రుల ప్రమాణ స్వీకార వేడుక చెన్నై నెహ్రూ స్టేడియంలో జరగనున్నది. దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టిన విషయం గవర్నర్ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్లను పిలిచి క్లాస్ తీసుకున్నారు.
గవర్నర్ ఆవేశంగా, ‘‘ప్రభుత్వ ఏర్పాటుపై చట్టపరమైన నిర్ణయం తీసుకోకముందే ఏర్పాట్లు ఎందుకు? వేడుక సాధారణంగా రాజ్భవన్లోనే జరుగుతుందని, నెహ్రూ స్టేడియానికి మార్చబడిన కారణం తెలియదని’’ అన్నారు. వెంటనే ఏర్పాట్లను నిలిపివేయాలని ఆదేశించారు. స్టేడియంలో జరుగుతున్న పనులు అడ్డుకున్నాయి. అంతేకాకుండా, ఇంటెలిజెన్స్ విభాగంలో ఇద్దరు కొత్త అధికారుల నియామకంపై కూడా గవర్నర్ డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.