కామారెడ్డి జాతీయహైవే బస్-లారీ ఢీకొలుపు ఘటన
కామారెడ్డి: జాతీయహైవే 44 పైన పొందుర్తి పెట్రోల్ బంక్ సమీపంలో లారీని రోడ్డు పక్కన ఆపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బోధన్ డిపోకి చెందిన సూపర్ లక్సరీ బస్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ లో ప్రయాణిస్తున్న 4 పెద్దలు, 2 పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
స్థానికులు గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. బోధన్ బస్ డ్రైవర్ నామియావర్ యాదవ్ తెలిపినట్లుగా, లారీ డ్రైవర్ ఘటన తర్వాత పారిపోవడం జరిగిందని స్థానికులు తెలిపారు.