నంద్యాల: సన్ రైజ్ జూనియర్ కళాశాల సీజ్ డిమాండ్
నంద్యాల :
PDSU-PSU విద్యార్ధి సంఘాలు ప్రభుత్వ అనుమతులు లేకుండా, తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను మోసం చేస్తున్న సన్ రైజ్ జూనియర్ కాలేజీ (రెసిడెన్షియల్) ను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు, PSU జిల్లా కన్వీనర్ సురేష్ తదితర నేతలు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ కు ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు.రాంబాబు, సురేష్ ప్రకారం, సన్ రైజ్ జూనియర్ కళాశాల భువన విజయం కళాశాల పేరుతో అనుమతులు లేనప్పటికీ అడ్మిషన్లు తీసుకుంటోంది. JEE, AIIMS, NEET వంటి పరీక్షల అనుమతులు లేకుండానే పాఠశాలగా ప్రచారం చేయడం ద్వారా విద్యార్థులు, తల్లితండ్రులను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. అదేవిధంగా, ఫైర్ సేఫ్టీ, గ్రౌండ్, లాబ్స్, టాయిలెట్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం కూడా చూపించారు. వాసవి బాయ్స్ హాస్టల్ లో గర్ల్స్ కళాశాల పేరుతో పెర్మిషన్లు లేకుండా బ్యానర్లు వేసి మోసం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. DIO శంకర్ నాయక్ స్పందించి బ్యానర్లు తొలగిస్తామని, తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థి సంఘాలు సన్ రైజ్ కళాశాల ముందు భారీ ధర్నా ప్రకటించనున్నట్లు తెలిపారు.