logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిరుపతి: జి. భాస్కర్ కుటుంబానికి ఉపాధి కోసం ఆవేదన

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెరుమాళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసిన జి. భాస్కర్, రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయల ఖర్చు చేసిన కుటుంబం ప్రస్తుతం అప్పుల ఊబిలో పడింది.

జి. భాస్కర్ మరణానంతరం ఆయన కుమారుడు గుమ్మా నందకుమార్ కారుణ్య నియామక ఉద్యోగం కోసం అన్ని అర్హతలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జెడ్పీ కార్యాలయం 'ఖాళీలు లేవు' అని సమాధానం ఇస్తోంది. మండల విద్యాశాఖ అధికారి ప్రతిపాదనలు పంపినా ఫలితం రాలేదు. సోమవారం కలెక్టరేట్ మెట్టుకున్న గుమ్మా నందకుమార్ తన ఆర్థిక పరిస్థితి విషమంగా ఉందని, ప్రభుత్వ స్పందన కోరుతూ మీడియా ముందు కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

4
104 views

Comment