సాలూరు లో తొలి ఏసీ కళ్యాణ మండపం ప్రారంభం
సాలూరు: సాలూరు టౌన్ లో తొలి ఏసీ కళ్యాణ మండపం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మే 4, 2026న జరిగింది. గతంలో వాసవి భవన్ ఉన్న ప్రదేశంలో ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో ఈ నూతన భవనం పునర్నిర్మించారు. ఇప్పటివరకు 1 కోటి 60 లక్షల రూపాయల వ్యయం జరిగింది... మరో 25 లక్షలతో మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
మంత్రి జి. సంధ్యారాణి, మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త టీ.జీ వెంకటేష్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజిదేవ్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భవనం కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా ఆర్యవైశ్య సేవా తత్వం, సంఘటిత శక్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.