వడదెబ్బ మృతుడి కుటుంబానికి గండి చిరంజీవులు ఆర్థిక సాయం
రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కత్తిరి ఆదిత్య (బాబి) వడదెబ్బతో మృతి చెందిన నేపథ్యంలో, మీ సేన–మీ సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గండి చిరంజీవులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన రూ.3,000 ఆర్థిక సాయం అందజేసి, కుటుంబానికి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గండి చిరంజీవులు తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.