పాడేరు: భారీ కరాటే ప్రదర్శనలో పాల్గొన్న అల్లూరి జిల్లా విద్యార్థులు
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో ఆదివారం జరిగిన భారీ కరాటే ప్రదర్శనలో అల్లూరి జిల్లా నుండి నలుగురు విద్యార్ధులు హజరైనట్లు కరాటే శిక్షకులు బాకూరు పాండురాజు తెలిపారు. ఎం దీప్తీక(పాడేరు), హర్షిణి(పాడేరు), మేరి(చింతపల్లి), కామేశ్వరరావు (జీ. మాడుగుల) లు ఈ భారీ కరాటే ప్రదర్శనలో పాల్గొని, కరాటే చేశారని పాండురాజు పేర్కొన్నారు. 2000 మంది ఒకే సారి కరాటే ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారన్నారు.