టీటీడీకి రూ.20 లక్షల విరాళం | అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ దానం
తిరుమలలో భక్తుల భక్తి భావం మరోసారి ప్రతిఫలించింది. 2026 ఏప్రిల్ 24న హైదరాబాద్కు చెందిన డాక్టర్ గీతిక సాయి గారు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.
అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ కూడా రూ.10,01,116 విరాళం అందించింది.
ఈ విరాళాలను దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు గారు, శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి డీడీల రూపంలో అందజేశారు.
టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తుల నుంచి వస్తున్న విరాళాలు అన్నదానం కార్యక్రమాలకు ఎంతో తోడ్పడుతున్నాయి.