రోలుగుంట పాఠశాలలో జనగణనపై వ్యాసరచన పోటీలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రోలుగుంటలో విద్యార్థులలో సామాజిక అవగాహన పెంపొందించేందుకు "జనగణన" అనేఅంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్, సబ్ జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వారి అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు గారు, ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం నాగజ్యోతి , బయాలజీ ఉపాధ్యాయులు విజయరాణి, నాని, హిందీ ఉపాధ్యాయిని రెహానా బేగం గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.