అరకు: డ్రగ్స్ వద్దు.. చదువే ముద్దు..
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో చదువుకుంటూ దీక్షిత్ భారత్ సాధనకు కృషి చేయాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే కలిగే నష్టాలను, వాటికి సంబంధించిన చట్టాలు, శిక్షలు గురించి NSS పీఓలు నాగబాబు, విజయలక్ష్మి, అనిత కుమారి తెలియజేశారు.