చీపురుపల్లి పంచాయతీకి ISO గుర్తింపు
చీపురుపల్లి:చీపురుపల్లి మేజర్ పంచాయతీకి ISO గుర్తింపు లభించినది. ISO-9001-2015 గా గుర్తింపు పొందింది. కేరళ రాష్ట్రoకి చెందిన స్థానిక పరిపాలన వ్యవహారాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సుకుమార్ మరియు రాష్ట్ర పంచాయతీ కార్యాలయం అధికారి ఇమామ్మ్ మంగళవారం చీపురుపల్లి పంచాయతీ సందర్శించి, తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు, తదితర అంశాల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ISO గుర్తింపు మంజూరు చేసి, ధృవపత్రం పంచాయతీ కార్యదర్శి సురేష్ కి అందచేశారు.