అరకు: ఐవిఆర్ఎస్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ లపై అవగాహణ
ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ కు లభ్ధిదారులు స్పందించాలని అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని మాడగడ గ్రామంలో ఐవిఆర్ఎస్ కాల్స్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ లపై నిర్వహించిన అవగాహణలో ఆయన మాట్లాడారు. అలాగే స్వచ్ఛరథం గురించి వివరించి, పాత పేపర్లు, వాడని ప్లాస్టిక్, అట్టలు, ఇనుము స్వచ్ఛరథం వద్ద ఇచ్చి నిత్యవసరాలను పొందవచ్చన్నారు. పీడీఓ రామస్వామి, సచివాలయ సిబ్బంది, SHG సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.