అరకు: సాంప్రదాయ కాగితపు పద్ధతులకు భిన్నంగా భారత జనగణన 2027
అరకులోయ ఎంపీడీఓ సమావేశ మందిరంలో భారత జనగణన 2027 కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల 3వ బ్యాచ్ శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణలో మొదటి ఫేజ్ లో చేపట్టే ఇళ్ల జాబితా మరియు గృహ గణనపై ఎంపీడీఓ ప్రసాద్, తాహశీల్దార్ కుమారస్వామి అవగహన కల్పించారు. సాంప్రదాయ కాగితపు పద్ధతులకు భిన్నంగా, ట్యాబ్లెట్లు లేదా మొబైల్ యాప్ల ద్వారా డేటా సేకరణ ఏవిధంగా చేయాలో తెలియజేశారు. శిక్షణార్థులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు.